ETV Bharat / sports

సర్ఫరాజ్ ఖాన్ vs రజత్​ పటీదార్- రెండో టెస్ట్​లో రాహుల్ స్థానం ఎవరికో?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 11:08 AM IST

IND vs ENG Test Series 2024 : గాయంతో రెండో టెస్టుకు దూరమైన రాహుల్ స్థానంలో ఎవరు ఆడతారు అనేది ఇప్పుడు ఆస్తకిగా మారింది. ఈ స్థానం కోసం ఇద్దరు ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది.

IND vs ENG Test Series 2024
IND vs ENG Test Series 2024

IND vs ENG Test Series 2024 : గాయాలతో రెండో టెస్టుకు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమైన నేపథ్యంలో వారి స్థానంలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.. బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ టెస్టు కోసం యూపీ ఆల్​ రౌండర్ సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్​, ముంబయి బ్యాటర్ సర్ఫరాజ్​ ఖాన్​లను ఎంపిక చేసింది. అయితే, ఇప్పుడు కేఎల్ రాహుల్ స్థానంలో ఎవరు ఆడతారు అనేది అందరిలో ఆసక్తిరేపుతున్న అంశం. ఈ స్థానం కోసం రజత్ పటీదార్, సర్పరాజ్​ ఖాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

అవకాశం ఎవరికి?
ఇప్పటికే కోహ్లి గైర్హాజరీతో రజత్‌ పటీదార్‌ 15 మంది సభ్యుల జట్టులో స్థానం సంపాదించాడు. రాహుల్ జడేజా దూరమయ్యాక ముగ్గురు ఆటగాళ్లు వచ్చారు. సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్ ఆటగాళ్లిద్దరూ అరంగేట్రంపై ఆశలతో ఉన్నారు. వారిలో రాహుల్ స్థానంలో ఆడే అవకాశం ఎవరికి లభిస్తుందన్నది ప్రశ్న. మరోవైపు అయితే ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం అంటే కష్టమేనని టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అంటున్నారు.

"సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్ ఇద్దరూ చాలా మంచి ఆటగాళ్లు. గత కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్లో వాళ్లెంత బాగా ఆడుతున్నారో చూస్తున్నాం. ఇలాంటి పిచ్‌లపై ఆ బ్యాటర్లు జట్టుకు ఎంతో విలువను చేకూరుస్తారు. ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సివస్తే అది కష్టమైన పనే. దీనిపై రాహుల్‌ ద్రవిడ్‌, రోహిత్‌ నిర్ణయం తీసుకుంటారు"
- విక్రమ్ రాఠోడ్, టీమ్​ఇండియా బ్యాటింగ్ కోచ్

బాగా ప్రాక్టీస్ చేయాలి
పిచ్‌ను బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుందని టీమ్​ఇండియా బ్యాటింగ్ కోచ్ అన్నారు. రెండో టెస్టు పిచ్‌ గురించి అంచనా వేయడం కష్టమే. కానీ స్పిన్‌కు అనుకూలిస్తుంది. అది మొదటి రోజు నుంచి కాకపోవచ్చు అని అంటున్నారు. ఇకపోతే తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ బ్యాటర్లు స్వీప్‌ షాట్ల కారణంగా భారత స్పిన్నర్లు ప్రభావం చూపించలేకపోయారు. అలాంటి షాట్‌ ఒక్క రోజులో నేర్చుకునేది కాదని రాఠోడ్‌ అంటున్నారు. 'అలా ఆడాలంటే బాగా ప్రాక్టీస్‌ చేయాలి. బ్యాటర్లు తమ అమ్ములపొదిలో ఎన్ని షాట్లను చేర్చుకుంటే అంత లాభం ఉంటుంది. తొలి టెస్టులో మేం సంప్రదాయబద్ధంగా ఆడాం' అని రాఠోడ్ తెలిపారు.

ఇంగ్లాండ్ బ్యాటర్​పై ప్రశంసలు
ఇంగ్లాండ్‌ బ్యాటర్లపై, ముఖ్యంగా ఒలీ పోప్‌పై రాఠోడ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. 'వాళ్లు ధైర్యంగా ఆడారు. పోప్‌ గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. మన బౌలర్లపై అలాంటి ఇన్నింగ్స్‌ ఆడిన వాళ్లు చాలా తక్కువ. అయితే మాపై ఒత్తిడేమీ లేదు. భారత్‌లో ఆడేటప్పుడు మేం గెలుస్తామనే అంతా అనుకుంటారు. అంచనాలకు ఆటగాళ్లు అలవాటు పడ్డారు. మంచి క్రికెట్‌ ఆడాలని, కానీ ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించొద్దని ఆటగాళ్లకు చెప్పాం. అని విక్రమ్ రాఠోడ్ చెప్పారు. భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య రెండో టెస్టు శుక్రవారం ఆరంభం కానుంది.

జడేజా, కేెఎల్​ రాహుల్​ను వీడని గాయాలు- 36 నెలల్లో 11సార్లు ఆటకు దూరం

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ - మయాంక్ సేఫ్​

IND vs ENG Test Series 2024 : గాయాలతో రెండో టెస్టుకు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ దూరమైన నేపథ్యంలో వారి స్థానంలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.. బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈ టెస్టు కోసం యూపీ ఆల్​ రౌండర్ సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్​, ముంబయి బ్యాటర్ సర్ఫరాజ్​ ఖాన్​లను ఎంపిక చేసింది. అయితే, ఇప్పుడు కేఎల్ రాహుల్ స్థానంలో ఎవరు ఆడతారు అనేది అందరిలో ఆసక్తిరేపుతున్న అంశం. ఈ స్థానం కోసం రజత్ పటీదార్, సర్పరాజ్​ ఖాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

అవకాశం ఎవరికి?
ఇప్పటికే కోహ్లి గైర్హాజరీతో రజత్‌ పటీదార్‌ 15 మంది సభ్యుల జట్టులో స్థానం సంపాదించాడు. రాహుల్ జడేజా దూరమయ్యాక ముగ్గురు ఆటగాళ్లు వచ్చారు. సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్ ఆటగాళ్లిద్దరూ అరంగేట్రంపై ఆశలతో ఉన్నారు. వారిలో రాహుల్ స్థానంలో ఆడే అవకాశం ఎవరికి లభిస్తుందన్నది ప్రశ్న. మరోవైపు అయితే ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవడం అంటే కష్టమేనని టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ అంటున్నారు.

"సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్ ఇద్దరూ చాలా మంచి ఆటగాళ్లు. గత కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్లో వాళ్లెంత బాగా ఆడుతున్నారో చూస్తున్నాం. ఇలాంటి పిచ్‌లపై ఆ బ్యాటర్లు జట్టుకు ఎంతో విలువను చేకూరుస్తారు. ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సివస్తే అది కష్టమైన పనే. దీనిపై రాహుల్‌ ద్రవిడ్‌, రోహిత్‌ నిర్ణయం తీసుకుంటారు"
- విక్రమ్ రాఠోడ్, టీమ్​ఇండియా బ్యాటింగ్ కోచ్

బాగా ప్రాక్టీస్ చేయాలి
పిచ్‌ను బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుందని టీమ్​ఇండియా బ్యాటింగ్ కోచ్ అన్నారు. రెండో టెస్టు పిచ్‌ గురించి అంచనా వేయడం కష్టమే. కానీ స్పిన్‌కు అనుకూలిస్తుంది. అది మొదటి రోజు నుంచి కాకపోవచ్చు అని అంటున్నారు. ఇకపోతే తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ బ్యాటర్లు స్వీప్‌ షాట్ల కారణంగా భారత స్పిన్నర్లు ప్రభావం చూపించలేకపోయారు. అలాంటి షాట్‌ ఒక్క రోజులో నేర్చుకునేది కాదని రాఠోడ్‌ అంటున్నారు. 'అలా ఆడాలంటే బాగా ప్రాక్టీస్‌ చేయాలి. బ్యాటర్లు తమ అమ్ములపొదిలో ఎన్ని షాట్లను చేర్చుకుంటే అంత లాభం ఉంటుంది. తొలి టెస్టులో మేం సంప్రదాయబద్ధంగా ఆడాం' అని రాఠోడ్ తెలిపారు.

ఇంగ్లాండ్ బ్యాటర్​పై ప్రశంసలు
ఇంగ్లాండ్‌ బ్యాటర్లపై, ముఖ్యంగా ఒలీ పోప్‌పై రాఠోడ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. 'వాళ్లు ధైర్యంగా ఆడారు. పోప్‌ గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. మన బౌలర్లపై అలాంటి ఇన్నింగ్స్‌ ఆడిన వాళ్లు చాలా తక్కువ. అయితే మాపై ఒత్తిడేమీ లేదు. భారత్‌లో ఆడేటప్పుడు మేం గెలుస్తామనే అంతా అనుకుంటారు. అంచనాలకు ఆటగాళ్లు అలవాటు పడ్డారు. మంచి క్రికెట్‌ ఆడాలని, కానీ ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించొద్దని ఆటగాళ్లకు చెప్పాం. అని విక్రమ్ రాఠోడ్ చెప్పారు. భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య రెండో టెస్టు శుక్రవారం ఆరంభం కానుంది.

జడేజా, కేెఎల్​ రాహుల్​ను వీడని గాయాలు- 36 నెలల్లో 11సార్లు ఆటకు దూరం

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ - మయాంక్ సేఫ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.