ETV Bharat / politics

అమిత్​ షా వీడియో మార్ఫింగ్​ కేసు - మరోసారి గాంధీభవన్​కు దిల్లీ పోలీసులు - Amit Shah Fake Video Case

author img

By ETV Bharat Telangana Team

Published : May 2, 2024, 1:40 PM IST

Updated : May 2, 2024, 2:31 PM IST

Amit Shah Video Morphing Case Update
Amit Shah Morphing Video Case Update

Amit Shah Morphing Video Case Update : కేంద్ర హోంమంత్రి అమిత్​ షా వీడియో మార్ఫింగ్​ కేసులో దిల్లీ పోలీసులు మరోసారి హైదరాబాద్​లోని గాంధీభవన్​కు వచ్చారు. ఈ కేసులో ఇప్పటికే సీఎం రేవంత్​ సహా పలువురికి నోటీసులు ఇవ్వగా, తాజాగా మరో నలుగురికి నోటీసులు ఇచ్చేందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

Amit Shah Video Morphing Case Update : కేంద్ర హోంమంత్రి అమిత్​ షా వీడియో మార్ఫింగ్​ కేసుకు సంబంధించి మరో నలుగురికి నోటీసులు ఇచ్చేందుకు దిల్లీ పోలీసులు మరోసారి గాంధీభవన్‌కు వచ్చారు. పీసీసీ లీగల్‌ సెల్‌ నాయకులతో మాట్లాడి నోటీసులు ఇస్తామన్న దిల్లీ పోలీసులు, లీగల్ సెల్‌ నాయకులు లేకపోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.

అసలు ఏం జరిగిందంటే : గత నెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభకు అమిత్ షా హాజరయ్యారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఆ హక్కులను తిరిగి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చేస్తామని వ్యాఖ్యానించారు. అయితే కొందరు ఆ మాటలను వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్​ షా చెబుతున్నట్లు వీడియో ఎడిట్​ చేశారని కేంద్ర హోంశాఖ, బీజేపీ దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అమిత్​ షా వీడియో మార్ఫింగ్​ కేసు - సీఎంకు నాలుగు వారాలు గడువు కోరిన పీసీసీ లీగల్​ సెల్​ - Amit Shah Fake Video Case

అమిత్​ షా మాటలను వక్రీకరించి, ఫేక్​ వీడియోలతో సోషల్​ మీడియాలో దుష్ప్రచారం చేశారనే అభియోగంతో సీఎం రేవంత్​ రెడ్డితో పాటు మరో నలుగురు రాష్ట్ర కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా విభాగం ఛైర్మన్‌ మన్నె సతీశ్‌, కో-ఆర్డినేటర్‌ నవీన్‌, పీసీసీ కార్యదర్శి శివ కుమార్‌, అధికార ప్రతినిధి ఆస్మా తస్లీంలకు దిల్లీ పోలీసులు గత నెల 29న నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను నేరుగా గాంధీభవన్​కు పంపించారు. ఈ నోటీసులు అందుకున్న నేతలు మే 1న విచారణకు హాజరు కాని పక్షంలో సీఆర్​పీసీ 91/160 కింద క్రిమినల్​ ప్రొసీడింగ్స్​ ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు. దిల్లీ పోలీసులు ప్రత్యేక విభాగం వారు ఏప్రిల్​ 28న ఐటీ చట్టంతో పాటు ఐపీసీ 153, 153ఏ, 465, 469, 171జీ సెక్షన్ల కింద ఎఫ్​ఐఆర్​ ప్రకారం నోటీసులు ఇచ్చారు. దీనిపై ఘాటుగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, నోటీసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. తాజాగా మరో నలుగురికి నోటీసులు ఇచ్చేందుకు దిల్లీ పోలీసులు నేడు మరోసారి గాంధీభవన్​కు వచ్చారు.

అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌ కేసులో కాంగ్రెస్‌ నేతలకు నోటీసులు - భయపడేది లేదన్న సీఎం రేవంత్​ - Amit Shah Fake Video Case

Last Updated :May 2, 2024, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.