Prabhas Salaar Part 2 Shouryanga Parvam : దర్శకుడు ప్రశాంత్ నీల్ రీసెంట్గా 'సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం రూ.700కోట్లకుపైగా వసూళ్లను సాధించి మంచి లాభాలను అందుకుంది. అయితే ప్రశాంత్ నీల్ ప్లాన్ ప్రకారం సీజ్ ఫైర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో మూవీ చేయాలని అనుకున్నారట! అలానే 'కేజీయఫ్ పార్ట్ 3' కూడా ఉంటుంది అని ఆ మధ్యలో హింట్ ఇచ్చారు.
అయితే ఇప్పుడీ ఆర్డర్ మారబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. 'సలార్ 2' శౌర్యంగపర్వం వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారట. ఎందుకంటే బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడు అనే క్వశ్చన్ మార్క్ రెండో భాగంపై బాగా హైప్ను పెంచింది. కానీ సీజ్ఫైర్ బాగానే ఉన్నప్పటికీ బాహుబలి స్థాయిలో శౌర్యంగపర్వంపై బజ్ తీసుకురాలేదు! కాబట్టి ప్రస్తుతం ఆరు వందల కోట్లకుపైగా వసూళ్లతో ఊపుమీదున్న సలార్ రెండో భాగం ఇప్పుడే తీసేస్తే ప్రేక్షకులకు త్వరగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారట.
- " class="align-text-top noRightClick twitterSection" data="">