ETV Bharat / bharat

నదిలో పడిన బస్సు- 41 మంది మృతి - Nepal Bus Accident

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2024, 12:47 PM IST

Updated : Aug 23, 2024, 2:28 PM IST

Nepal Bus Accident : నేపాల్​లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 41 మంది మృతి చెందారు.

Nepal Bus accident
Nepal accident (ANI)

Nepal Bus Accident : నేపాల్​లో ఓ బస్సు నదిలో పడి 41 మంది మరణించారు. పదుల సంఖ్యలో ప్రయాణికులతో నేపాల్​లోని పొఖారా నుంచి కాఠ్​మండూకు బయలుదేరిన బస్సు, తనాహున్​ జిల్లాలోని ఐరా పహారా ప్రాంతంలో మార్స్యంగ్డి నదిలో పడిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఈ దుర్ఘటనలో 41 మంది చనిపోయినట్లు మహారాష్ట్ర మంత్రి గిరీశ్‌ మహాజన్‌ తెలిపారు. మృతులంతా మహారాష్ట్రవాసులని వెల్లడించారు. కాగా, మృతదేహాలను భారత్‌కు తీసుకురావడానికి ఎయిర్‌ఫోర్స్‌ విమానం నేపాల్‌ వెళ్లనునుంది.

ఇదీ జరిగింది
ఉత్తర్​ప్రదేశ్‌ రిజిస్ట్రేషన్(UP 53 FT 7623)​ ఉన్న ఓ ట్రావెల్స్‌ బస్సు నేపాల్​లోని పొఖారా నుంచి కాఠ్‌మాండూకు వెళ్తోంది. ఈ క్రమంలో తనాహున్​ జిల్లాలోని ఐరా పహారా ప్రాంతానికి చేరుకోగానే బస్సు అదుపుతప్పి మర్స్యాంగ్డి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న నేపాల్ ఆర్మీ సహాయక చర్యల కోసం రంగంలోకి దిగింది. 45మందితో కూడిన రెస్క్యూ టీమ్​ ప్రమాదస్థలికి చేరుకుని 29మంది ప్రయాణికులను రక్షించి ఆస్పత్రికి తరలించింది. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు, నేపాల్​ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. నేపాల్​ ఆర్మీకి చెందిన MI-17 హెలికాప్టర్​లో మెడికల్​ టీమ్​ను ఘటనాస్థలికి పంపించింది.
ఇదిలా ఉండగా, ఈ దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్​కు చెందిన ఓ అధికారి స్పందించారు. అక్కడి స్థానిక అధికారులతో మాట్లాడి సమాచారం తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు.

నదిలో పడిపోయిన రెండు బస్సులు
గత నెలలో కూడా నేపాల్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడటం వల్ల 65మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి. ఈ దుర్ఘటనలో మృదేహాల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలు నదిలో 100 కిలోమీటర్ల మేర కొట్టుకుపోయాయి. భారత్​ నుంచి 12మంది సభ్యుల ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం కూడా రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంది. ఆ నదిలో కొట్టుకుపోయిన బస్సులను ఇంకా కనుగొనలేదు. ఈ ప్రమాదంలో గల్లంతైన ఏడుగురు భారతీయులలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా ఇద్దరి ఆచూకీ దొరకలేదు.

నేపాల్​లో కుప్పకూలిన హెలికాప్టర్ - ఐదుగురు మృతి

టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం- 18మంది మృతి - Nepal Plane Crash

Nepal Bus Accident : నేపాల్​లో ఓ బస్సు నదిలో పడి 41 మంది మరణించారు. పదుల సంఖ్యలో ప్రయాణికులతో నేపాల్​లోని పొఖారా నుంచి కాఠ్​మండూకు బయలుదేరిన బస్సు, తనాహున్​ జిల్లాలోని ఐరా పహారా ప్రాంతంలో మార్స్యంగ్డి నదిలో పడిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
ఈ దుర్ఘటనలో 41 మంది చనిపోయినట్లు మహారాష్ట్ర మంత్రి గిరీశ్‌ మహాజన్‌ తెలిపారు. మృతులంతా మహారాష్ట్రవాసులని వెల్లడించారు. కాగా, మృతదేహాలను భారత్‌కు తీసుకురావడానికి ఎయిర్‌ఫోర్స్‌ విమానం నేపాల్‌ వెళ్లనునుంది.

ఇదీ జరిగింది
ఉత్తర్​ప్రదేశ్‌ రిజిస్ట్రేషన్(UP 53 FT 7623)​ ఉన్న ఓ ట్రావెల్స్‌ బస్సు నేపాల్​లోని పొఖారా నుంచి కాఠ్‌మాండూకు వెళ్తోంది. ఈ క్రమంలో తనాహున్​ జిల్లాలోని ఐరా పహారా ప్రాంతానికి చేరుకోగానే బస్సు అదుపుతప్పి మర్స్యాంగ్డి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న నేపాల్ ఆర్మీ సహాయక చర్యల కోసం రంగంలోకి దిగింది. 45మందితో కూడిన రెస్క్యూ టీమ్​ ప్రమాదస్థలికి చేరుకుని 29మంది ప్రయాణికులను రక్షించి ఆస్పత్రికి తరలించింది. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు, నేపాల్​ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. నేపాల్​ ఆర్మీకి చెందిన MI-17 హెలికాప్టర్​లో మెడికల్​ టీమ్​ను ఘటనాస్థలికి పంపించింది.
ఇదిలా ఉండగా, ఈ దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్​కు చెందిన ఓ అధికారి స్పందించారు. అక్కడి స్థానిక అధికారులతో మాట్లాడి సమాచారం తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు.

నదిలో పడిపోయిన రెండు బస్సులు
గత నెలలో కూడా నేపాల్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడటం వల్ల 65మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు త్రిశూలి నదిలో పడిపోయాయి. ఈ దుర్ఘటనలో మృదేహాల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలు నదిలో 100 కిలోమీటర్ల మేర కొట్టుకుపోయాయి. భారత్​ నుంచి 12మంది సభ్యుల ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం కూడా రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంది. ఆ నదిలో కొట్టుకుపోయిన బస్సులను ఇంకా కనుగొనలేదు. ఈ ప్రమాదంలో గల్లంతైన ఏడుగురు భారతీయులలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా ఇద్దరి ఆచూకీ దొరకలేదు.

నేపాల్​లో కుప్పకూలిన హెలికాప్టర్ - ఐదుగురు మృతి

టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం- 18మంది మృతి - Nepal Plane Crash

Last Updated : Aug 23, 2024, 2:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.