ETV Bharat / bharat

నూతన CJIగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా- నవంబర్‌ 11న ప్రమాణస్వీకారం

నూతన సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా- నవంబర్‌ 11న ప్రమాణస్వీకారం

New CJI of India 2024
New CJI of India 2024 (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

New CJI of India : సుప్రీం కోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పదవీ కాలం నవంబర్‌ 10న ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేరును సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో నవంబర్‌ 11న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా తదుపరి సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్​వాల్‌ వెల్లడించారు. కాగా, 2025 మే 13 వరకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సీజేఐగా కొనసాగనున్నారు.

జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 1983లో సంజీవ్‌ ఖన్నా దిల్లీ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. తర్వాత అక్కడి తీస్‌హజారీ జిల్లా కోర్టు, హైకోర్టు, ట్రైబ్యునళ్లలో లాయర్​గా ప్రాక్టీస్‌ చేశారు. ఇక 2005లో దిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006లో అక్కడే శాశ్వత న్యాయమూర్తిగానూ ప్రమోషన్​ పొందారు. జస్టిస్‌ ఖన్నా ప్రస్తుతం నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌, భోపాల్‌లోని నేషనల్‌ జ్యుడిషియల్‌ అకాడమీ పాలక మండలి సభ్యుడిగానూ ఉన్నారు.

New CJI of India : సుప్రీం కోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పదవీ కాలం నవంబర్‌ 10న ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేరును సిఫార్సు చేశారు. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో నవంబర్‌ 11న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా తదుపరి సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్​వాల్‌ వెల్లడించారు. కాగా, 2025 మే 13 వరకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సీజేఐగా కొనసాగనున్నారు.

జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 1983లో సంజీవ్‌ ఖన్నా దిల్లీ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. తర్వాత అక్కడి తీస్‌హజారీ జిల్లా కోర్టు, హైకోర్టు, ట్రైబ్యునళ్లలో లాయర్​గా ప్రాక్టీస్‌ చేశారు. ఇక 2005లో దిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006లో అక్కడే శాశ్వత న్యాయమూర్తిగానూ ప్రమోషన్​ పొందారు. జస్టిస్‌ ఖన్నా ప్రస్తుతం నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌, భోపాల్‌లోని నేషనల్‌ జ్యుడిషియల్‌ అకాడమీ పాలక మండలి సభ్యుడిగానూ ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.