ETV Bharat / bharat

'అంతా నా కళ్ల ముందే- క్షణాల్లోనే మారిపోయిన సీన్- లగేజ్ ట్రాలీలపై మృతదేహాలు తరలించాం' - DELHI RAILWAY STATION STAMPEDE

దిల్లీ రైల్వే స్టేషన్​ తొక్కిసలాటనను గుర్తుచేసుకున్న ప్రత్యక్ష సాక్షులు - లగేజ్​ తీసుకెళ్లే ట్రాలీలపై మృతదేహాలను తరలించిన రైల్వే కూలీలు

Delhi Railway Station stampede
Delhi Railway Station stampede (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2025, 1:33 PM IST

Updated : Feb 16, 2025, 1:43 PM IST

Delhi Railway Station stampede Eyewitnesses : "అంతా నా కళ్ల ముందే జరిగింది. మృతదేహాలను 14,15 ప్లాట్​ఫామ్​ల నుంచి లగేజ్​ తీసుకెళ్లే ట్రాలీల్లో అంబులెన్స్​ వద్దకు తీసుకొచ్చాం". దిల్లీ రైల్వేస్టేషన్​లో జరిగిన తొక్కిసలాటను ప్రత్యక్షంగా చూసిన ఓ రైల్వే కూలి మాటలివి. తమ కళ్ల ముందే జరిగిన తొక్కిసలాటను గుర్తుచేసుకున్నారు కొందరు ప్రత్యక్ష సాక్షులు. 18మంది మృతి చెందిన ఈ ఘటనకు తప్పుడు అనౌన్స్​మెంట్​ కారణమని తెలుస్తోంది. కొందరు ప్రత్యక్ష సాక్షులు కూడా తొక్కిసలాటకు అదే కారణమని చెప్పారు.

"అనౌన్స్​మెంట్​ వచ్చిని వెంటనే ప్రయాణికులు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు కదిలారు. ఏమి జరిగిందో అని చూసేలోపే కింద పడి చనిపోయారు. నేనెప్పుడూ ఇంత జనసమూహం చూడలేదు" అని రైల్వే స్టేషన్‌లో గత 12 సంవత్సరాలుగా దుకాణం నడుపుతున్న రవి కుమార్ తెలిపారు.

Delhi Railway Station stampede
రద్దీగా ఉన్న దిల్లీ రైల్వే స్టేషన్ (AP)

"స్టేషన్‌లో విపరీతంగా జనం ఉన్నారు. ఆమె రైలు ప్లాట్‌ఫారమ్ నంబర్ 12 వద్దకు చేరుకోవాల్సి ఉంది. అయితే, అనౌన్స్​మెంట్​ వచ్చిన తర్వాత, ప్రజలు పరుగులు తీశారు. పడిపోయిన వారి కాళ్ల కింద పడి చనిపోయారు" తొక్కిసలాటలో చనిపోయిన ఓ మహిళ అని బంధువు చెప్పారు.

Delhi Railway Station stampede
రోధిస్తున్న మృతుల బంధువులు (AP)

'అంతా నా కళ్ల ముందే జరిగింది'
"ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై భారీ జనం గుమిగూడారు. ఆ ప్రదేశమంతా ప్రజలు నిండిపోయారు. ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. దాదాపు 10-15 మంది అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇందంతా నా కళ్ల ముందే జరిగింది. మృతదేహాలను 14,15 ప్లాట్​ఫామ్​ల నుంచి మా(కూలీల) ట్రాలీల్లో అంబులెన్స్​ వద్దకు తీసుకొచ్చాం. అందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు" అని రైల్వే కూలీ కృష్ణ కుమార్​ జోగి గుర్తుచేసుకున్నారు.

తాము లగేజ్​ మోయడానికి ఉపయోగించే ట్రాలీలపై మృతదేహాలను తీసుకెళ్లామని మరో రైల్వే కూలీ బలరాం తెలిపాడు. తాను 15ఏళ్ల నుంచి కూలీగా పనిచేస్తున్నానని కానీ ఇంతమంది జనాన్ని స్టేషన్​లో ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. "ఘటనా ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిఉన్న ప్రయాణికులు చెప్పులు, వస్తువులు. చాలా మంది వృద్ధులను, చిన్న పిల్లలను తొక్కిసలాట నుంచి బయటకు తీసుకొచ్చాం." అని బలరాం గుర్తుచేసుకున్నాడు.

Delhi Railway Station stampede
ఘటనాస్థలిలో చెల్లాచెదురుగా పడిఉన్న ప్రయాణికుల వస్తువులు, చెప్పులు (AP)

'తొక్కిసలాటకు కారణం ఇదే'
తొల్కిసలాట జరిగిన సమయంలో 14వ నంబర్ ప్లాట్​ఫామ్​పై పట్నా వైపు వెళ్లే మగద్ ఎక్స్​ప్రెస్​, 15వ ప్లాట్​ఫామ్​పై న్యూదిల్లీ-జమ్ము ఉత్తర్​ సంపర్క్​ ఎక్స్​ప్రెస్​లు ఉన్నాయని ఉత్తర రైల్వే సీపీఆర్​ఓ హిమాన్షు ఉపాధ్యాయ్​ తెలిపారు. అనౌన్స్​మెంట్​ వచ్చిన తర్వాత ఫుట్​ ఓవర్​ బ్రిడ్జి ద్వారా 14, 15 ప్లాట్​ఫామ్​ల వైపు ప్రయాణికులు పరుగెత్తారని, ఈ క్రమంలో మెట్లపై జారి ఒకరిపై ఒకరు పడిపోయారని వెల్లడించారు. ఇదే తొక్కసలాటకు దారితీసిందని చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించి దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గందరగోళం చెలరేగడానికి ముందు జరిగిన సంఘటనలను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్‌ను విశ్లేషిస్తామని చెప్పారు. తమ బృందాలు బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేస్తున్నాయని వెల్లడించారు. మృతుల్లో 9మంది బిహార్‌కు చెందినవారు, 8 మంది దిల్లీకి నుంచి, ఒకరు హరియాణాకు చెందినవారు ఉన్నారని అధికారులు తెలిపారు.

Delhi Railway Station stampede Eyewitnesses : "అంతా నా కళ్ల ముందే జరిగింది. మృతదేహాలను 14,15 ప్లాట్​ఫామ్​ల నుంచి లగేజ్​ తీసుకెళ్లే ట్రాలీల్లో అంబులెన్స్​ వద్దకు తీసుకొచ్చాం". దిల్లీ రైల్వేస్టేషన్​లో జరిగిన తొక్కిసలాటను ప్రత్యక్షంగా చూసిన ఓ రైల్వే కూలి మాటలివి. తమ కళ్ల ముందే జరిగిన తొక్కిసలాటను గుర్తుచేసుకున్నారు కొందరు ప్రత్యక్ష సాక్షులు. 18మంది మృతి చెందిన ఈ ఘటనకు తప్పుడు అనౌన్స్​మెంట్​ కారణమని తెలుస్తోంది. కొందరు ప్రత్యక్ష సాక్షులు కూడా తొక్కిసలాటకు అదే కారణమని చెప్పారు.

"అనౌన్స్​మెంట్​ వచ్చిని వెంటనే ప్రయాణికులు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు కదిలారు. ఏమి జరిగిందో అని చూసేలోపే కింద పడి చనిపోయారు. నేనెప్పుడూ ఇంత జనసమూహం చూడలేదు" అని రైల్వే స్టేషన్‌లో గత 12 సంవత్సరాలుగా దుకాణం నడుపుతున్న రవి కుమార్ తెలిపారు.

Delhi Railway Station stampede
రద్దీగా ఉన్న దిల్లీ రైల్వే స్టేషన్ (AP)

"స్టేషన్‌లో విపరీతంగా జనం ఉన్నారు. ఆమె రైలు ప్లాట్‌ఫారమ్ నంబర్ 12 వద్దకు చేరుకోవాల్సి ఉంది. అయితే, అనౌన్స్​మెంట్​ వచ్చిన తర్వాత, ప్రజలు పరుగులు తీశారు. పడిపోయిన వారి కాళ్ల కింద పడి చనిపోయారు" తొక్కిసలాటలో చనిపోయిన ఓ మహిళ అని బంధువు చెప్పారు.

Delhi Railway Station stampede
రోధిస్తున్న మృతుల బంధువులు (AP)

'అంతా నా కళ్ల ముందే జరిగింది'
"ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై భారీ జనం గుమిగూడారు. ఆ ప్రదేశమంతా ప్రజలు నిండిపోయారు. ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. దాదాపు 10-15 మంది అక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇందంతా నా కళ్ల ముందే జరిగింది. మృతదేహాలను 14,15 ప్లాట్​ఫామ్​ల నుంచి మా(కూలీల) ట్రాలీల్లో అంబులెన్స్​ వద్దకు తీసుకొచ్చాం. అందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు" అని రైల్వే కూలీ కృష్ణ కుమార్​ జోగి గుర్తుచేసుకున్నారు.

తాము లగేజ్​ మోయడానికి ఉపయోగించే ట్రాలీలపై మృతదేహాలను తీసుకెళ్లామని మరో రైల్వే కూలీ బలరాం తెలిపాడు. తాను 15ఏళ్ల నుంచి కూలీగా పనిచేస్తున్నానని కానీ ఇంతమంది జనాన్ని స్టేషన్​లో ఎప్పుడూ చూడలేదని చెప్పాడు. "ఘటనా ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిఉన్న ప్రయాణికులు చెప్పులు, వస్తువులు. చాలా మంది వృద్ధులను, చిన్న పిల్లలను తొక్కిసలాట నుంచి బయటకు తీసుకొచ్చాం." అని బలరాం గుర్తుచేసుకున్నాడు.

Delhi Railway Station stampede
ఘటనాస్థలిలో చెల్లాచెదురుగా పడిఉన్న ప్రయాణికుల వస్తువులు, చెప్పులు (AP)

'తొక్కిసలాటకు కారణం ఇదే'
తొల్కిసలాట జరిగిన సమయంలో 14వ నంబర్ ప్లాట్​ఫామ్​పై పట్నా వైపు వెళ్లే మగద్ ఎక్స్​ప్రెస్​, 15వ ప్లాట్​ఫామ్​పై న్యూదిల్లీ-జమ్ము ఉత్తర్​ సంపర్క్​ ఎక్స్​ప్రెస్​లు ఉన్నాయని ఉత్తర రైల్వే సీపీఆర్​ఓ హిమాన్షు ఉపాధ్యాయ్​ తెలిపారు. అనౌన్స్​మెంట్​ వచ్చిన తర్వాత ఫుట్​ ఓవర్​ బ్రిడ్జి ద్వారా 14, 15 ప్లాట్​ఫామ్​ల వైపు ప్రయాణికులు పరుగెత్తారని, ఈ క్రమంలో మెట్లపై జారి ఒకరిపై ఒకరు పడిపోయారని వెల్లడించారు. ఇదే తొక్కసలాటకు దారితీసిందని చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించి దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గందరగోళం చెలరేగడానికి ముందు జరిగిన సంఘటనలను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్‌ను విశ్లేషిస్తామని చెప్పారు. తమ బృందాలు బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేస్తున్నాయని వెల్లడించారు. మృతుల్లో 9మంది బిహార్‌కు చెందినవారు, 8 మంది దిల్లీకి నుంచి, ఒకరు హరియాణాకు చెందినవారు ఉన్నారని అధికారులు తెలిపారు.

Last Updated : Feb 16, 2025, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.