ETV Bharat / bharat

'ఆర్మ్​స్ట్రాంగ్ హత్య కేసును సీబీఐకు అప్పగించాలి'- మాయావతి డిమాండ్​ - TN BSP Leader Murder Case

Armstrong Murder Case : తమిళనాడు బీఎస్పీ చీఫ్ ఆర్మ్​స్ట్రాంగ్ హత్య కేసులో అసలైన దోషులను ప్రభుత్వం అరెస్ట్ చేయలేదని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. ఆర్మ్​స్ట్రాంగ్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు.

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 12:06 PM IST

Updated : Jul 7, 2024, 12:28 PM IST

Armstrong murder: Mayawati says real culprits not arrested, demands CBI probe into matter
Mayawati (ANI)

Armstrong Murder Case : తమిళనాడు బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్​స్ట్రాంగ్‌ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. తమిళనాడులో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్​ను కోరారు. ఆర్మ్​స్ట్రాంగ్​ను హత్య చేసిన అసలైన దోషులను పోలీసులు అరెస్టు చేయలేదని ఆరోపించారు. ఆర్మ్​స్ట్రాంగ్ హత్యతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులు ఆందోళన చెందుతున్నారని, వారి భద్రతకు భరోసా ఇవ్వాలని సీఎం స్టాలిన్​ను మాయావతి కోరారు. కాగా, పెరంబూర్​లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆర్మ్​స్ట్రాంగ్ మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి మాయావతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమిళనాడు సర్కార్​పై విమర్శలు గుప్పించారు.

"ఆర్మ్​స్ట్రాంగ్ హత్య కేసులో న్యాయం జరిగేటట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ చూడాలి. అందుకే ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. ఆర్మ్​స్ట్రాంగ్ హత్య చేసిన తీరును చూస్తే తమిళనాడులో లా అండ్ అర్డర్ లేనట్లు అనిపిస్తుంది. అసలైన నిందితులను పోలీసులు పట్టుకోలేదు. ప్రభుత్వం ఈ కేసును సీరియస్​గా తీసుకోలేదు. అలా అయితే ఇప్పటికే అసలైన నిందితులను అరెస్ట్ చేసి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్మ్​స్ట్రాంగ్​కు న్యాయం చేస్తుందన్న నమ్మకం మాకు లేదు. బహుజన్ సమాజ్ పార్టీ ఆర్మ్​స్ట్రాంగ్ హత్య కేసును సీరియస్గా తీసుకుంది. మేం మౌనంగా కూర్చొము. పార్టీ కార్యకర్తలు శాంతి భద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అని మాయావతి వ్యాఖ్యానించారు.

4 గంటల్లోనే నిందితులు అరెస్ట్
జూన్ 5వ తేదీ రాత్రి చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్​స్ట్రాంగ్​ను కొంత మంది కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన 4 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపామని నార్త్ జోన్ అడిషనల్ కమిషనర్ అజ్రా కార్గ్ శనివారం తెలిపారు. తగిన ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీని మాత్రమే కాకుండా హత్యకు ఉపయోగించిన 7 కొడవళ్లు, 3 బైక్​లను కూడా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కాగా, హత్యకు గురైన ఆర్మ్​స్ట్రాంగ్ మృతదేహాన్ని పోస్ట్​మార్టం అనంతరం ఆయన కుటుంబ సభ్యులను అప్పగించారు పోలీసులు.

పూరీ జగన్నాథుని రథయాత్రకు అంతా రెడీ- 1971 తర్వాత తొలిసారి ఇలా!

'భోలే బాబాను తొక్కిసలాట ఘటనలో ఇరికించేందుకు కుట్ర'- 'సత్సంగ్ నిర్వహించిన వ్యక్తే బాధ్యత వహించాలి' - Hathras Stampede Case Updates

Armstrong Murder Case : తమిళనాడు బహుజన్‌ సమాజ్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్​స్ట్రాంగ్‌ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. తమిళనాడులో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్​ను కోరారు. ఆర్మ్​స్ట్రాంగ్​ను హత్య చేసిన అసలైన దోషులను పోలీసులు అరెస్టు చేయలేదని ఆరోపించారు. ఆర్మ్​స్ట్రాంగ్ హత్యతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులు ఆందోళన చెందుతున్నారని, వారి భద్రతకు భరోసా ఇవ్వాలని సీఎం స్టాలిన్​ను మాయావతి కోరారు. కాగా, పెరంబూర్​లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఆర్మ్​స్ట్రాంగ్ మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి మాయావతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమిళనాడు సర్కార్​పై విమర్శలు గుప్పించారు.

"ఆర్మ్​స్ట్రాంగ్ హత్య కేసులో న్యాయం జరిగేటట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ చూడాలి. అందుకే ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలి. ఆర్మ్​స్ట్రాంగ్ హత్య చేసిన తీరును చూస్తే తమిళనాడులో లా అండ్ అర్డర్ లేనట్లు అనిపిస్తుంది. అసలైన నిందితులను పోలీసులు పట్టుకోలేదు. ప్రభుత్వం ఈ కేసును సీరియస్​గా తీసుకోలేదు. అలా అయితే ఇప్పటికే అసలైన నిందితులను అరెస్ట్ చేసి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్మ్​స్ట్రాంగ్​కు న్యాయం చేస్తుందన్న నమ్మకం మాకు లేదు. బహుజన్ సమాజ్ పార్టీ ఆర్మ్​స్ట్రాంగ్ హత్య కేసును సీరియస్గా తీసుకుంది. మేం మౌనంగా కూర్చొము. పార్టీ కార్యకర్తలు శాంతి భద్రతలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అని మాయావతి వ్యాఖ్యానించారు.

4 గంటల్లోనే నిందితులు అరెస్ట్
జూన్ 5వ తేదీ రాత్రి చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్​స్ట్రాంగ్​ను కొంత మంది కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన 4 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపామని నార్త్ జోన్ అడిషనల్ కమిషనర్ అజ్రా కార్గ్ శనివారం తెలిపారు. తగిన ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీని మాత్రమే కాకుండా హత్యకు ఉపయోగించిన 7 కొడవళ్లు, 3 బైక్​లను కూడా స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కాగా, హత్యకు గురైన ఆర్మ్​స్ట్రాంగ్ మృతదేహాన్ని పోస్ట్​మార్టం అనంతరం ఆయన కుటుంబ సభ్యులను అప్పగించారు పోలీసులు.

పూరీ జగన్నాథుని రథయాత్రకు అంతా రెడీ- 1971 తర్వాత తొలిసారి ఇలా!

'భోలే బాబాను తొక్కిసలాట ఘటనలో ఇరికించేందుకు కుట్ర'- 'సత్సంగ్ నిర్వహించిన వ్యక్తే బాధ్యత వహించాలి' - Hathras Stampede Case Updates

Last Updated : Jul 7, 2024, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.