తెలంగాణ

telangana

'మైనార్టీల సంరక్షణలో కేసీఆర్ ప్రభుత్వమే నెంబర్ వన్'

By

Published : Jun 2, 2019, 12:05 PM IST

రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ తోఫా పంపిణీ వేడుకలా జరుగుతోంది. గచ్చిబౌలి డివిజన్​లో ఎంపీ రంజిత్ రెడ్డి.. ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందించారు.

రంజాన్​ తోఫా

రంజాన్​ తోఫా పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. షాది ముభారక్, రంజాన్ తోఫా లాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నెహ్రూనగర్, చిన్న అంజయ్య నగర్​లో‌ ముస్లింలకు‌ రంజాన్ తోఫా బట్టల బ్యాగులను రంజిత్ రెడ్డి పంపిణీ చేశారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, బిలాల్ మజీద్ అధ్యక్షుడు బాబర్, స్థానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details