ETV Bharat / state

అసెంబ్లీ సాక్షిగా నేడు జాబ్​ క్యాలెండర్​ ప్రకటన : మంత్రి పొంగులేటి - telangana job calendar release news

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 1, 2024, 7:02 PM IST

Updated : Aug 2, 2024, 6:31 AM IST

Telangana Job Calendar 2024 Release Tomorrow : అసెంబ్లీలో నేడు జాబ్​ క్యాలెండర్​ను ప్రకటిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. యువతకు హామీ ఇచ్చిన ప్రకారం జాబ్​ క్యాలెండర్​ విడుదల చేస్తామన్నారు. అలాగే త్వరలో ప్రజలకు తెల్ల రేషన్​ కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్​లోని మంత్రివర్గ నిర్ణయాలను పొంగులేటి వెల్లడించారు.

Telangana Job Calendar 2024 Release Tomorrow
Telangana Job Calendar 2024 Release Tomorrow (ETV Bharat)

Telangana Job Calendar Release Tomorrow in Assembly : నేడు అసెంబ్లీలో జాబ్​ క్యాలెండర్​ను ప్రకటించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ​రెడ్డి వెల్లడించారు. యువతకు హామీ ఇచ్చిన ప్రకారం జాబ్​ క్యాలెండర్​ విడుదల చేస్తామన్నారు. అలాగే త్వరలో ప్రజలకు తెల్ల రేషన్​ కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. పేదలకు తెల్లరేషన్​ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు ఇస్తామని చెప్పారు. రేషన్​ కార్డుల జారీ విధివిధానాల కోసం కేబినెట్​ సబ్​ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను తప్పకుండా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని మంత్రివర్గ నిర్ణయాలను ప్రెస్​మీట్​ పెట్టి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి వెల్లడించారు.

క్రీడాకారులు ఈషాసింగ్​, నిఖత్​ జరీన్​, సిరాజ్​కు 600 గజాలు చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. విధుల్లో చనిపోయిన రాజీవ్​ రతన్​ కుమారుడికి మున్సిపల్ కమిషనర్​ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మరో అధికారి మురళి కుమారుడికి గ్రూప్​-1 ఉద్యోగం ఇవ్వనున్నట్లు వివరించారు.

"ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్​కు మళ్లీ ప్రతిపాదనలు పంపుతున్నాం. కోదండరాంరెడ్డి, అమీర్​ అలీఖాన్​ పేర్లను మరోసారి గవర్నర్​కు పంపాలని నిర్ణయించాం. నిజాం చక్కెర పరిశ్రమ పునరుద్ధరణకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. నగరంలో మూసీ సుందరీకరణకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. గోదావరి జలాలను హైదరాబాద్​ జంట జలాశయాలకు తరలిస్తాం. మల్లన్న సాగర్​ నుంచి జంట జలాశయాలకు గోదావరి జలాలు తరలిస్తాం." అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి స్పష్టం చేశారు.

" జాబ్​ క్యాలెండర్​ను అసెంబ్లీలో విడుదల చేస్తున్నాము. త్వరలో తెల్ల రేషన్​కార్డులు ఇచ్చే ప్రారంభం. అలాగే పేదలకు రేషన్​ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు ఇస్తాము. క్రీడాకారులు ఈషాసింగ్​, నిఖత్​ జరీన్, సిరాజ్​లకు 600 గజాల చొప్పున ఇంటి స్థలం.కోదండరాంరెడ్డి, అమీర్​ అలీఖాన్​ పేర్లను మరోసారి గవర్నర్​కు పంపాం. ఎమ్మెల్సీలుగా నియామకం కోసం. గౌరవెల్లి ప్రాజెక్టు త్వరిత గతిన పూర్తి కావడానికి అధిక మొత్తం కేటాయించాం." - పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, మంత్రి

గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తికి రూ.437 కోట్లు నిధులు : గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్​ పనుల పూర్తి కోసం నిధులు కేటాయించనున్నారు. ఇందుకు రూ.437 కోట్లు విడుదలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గౌరవెల్లి ప్రాజెక్టుకు నిధుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్​ ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్​ నిర్ణయంపై మంత్రి పొన్నం ప్రభాకర్​ హర్షం వ్యక్తం చేశారు.

జీహెచ్​ఎంసీ ఔటర్​ గ్రామాల విలీనానికి సబ్​ కమిటీ : జీహెచ్​ఎంసీలో ఔటర్​ గ్రామాల విలీనానికి కేబినెట్​ సబ్​ కమిటీని నియమించారు. జీహెచ్​ఎంసీ విలీన కమిటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్​, సీతక్క, శ్రీధర్​ బాబు సభ్యులుగా ఉండనున్నారు. రైతు భరోసా విధివిధానాలపై కేబినెట్​ భేటీలో చర్చించారు. ఈ సమావేశం అనంతరం రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం మీర్​ఖాన్​పేటలో స్కిల్​ డెవలప్​మెంట్​ యూనివర్సిటీ శంకుస్థాపనకు సీఎం రేవంత్​, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్​ బాబు, శాసనసభ స్పీకర్​ గడ్డం ప్రసాద్​ వెళ్లారు.

త్వరలో జాబ్​ క్యాలెండర్​ - 2 లక్షల ఉద్యోగాల భర్తీ : మంత్రి శ్రీధర్​బాబు - JOB CALENDER IN TELANGANA

నిరుద్యోగులకు గుడ్​న్యూస్ - ఇక నుంచి ప్రతి ఏటా ఉద్యోగ జాతరే! - మరో వారంలో జాబ్ క్యాలెండర్ - TELANGANA JOB CALENDAR

Telangana Job Calendar Release Tomorrow in Assembly : నేడు అసెంబ్లీలో జాబ్​ క్యాలెండర్​ను ప్రకటించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ​రెడ్డి వెల్లడించారు. యువతకు హామీ ఇచ్చిన ప్రకారం జాబ్​ క్యాలెండర్​ విడుదల చేస్తామన్నారు. అలాగే త్వరలో ప్రజలకు తెల్ల రేషన్​ కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. పేదలకు తెల్లరేషన్​ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు ఇస్తామని చెప్పారు. రేషన్​ కార్డుల జారీ విధివిధానాల కోసం కేబినెట్​ సబ్​ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను తప్పకుండా నెరవేరుస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని మంత్రివర్గ నిర్ణయాలను ప్రెస్​మీట్​ పెట్టి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి వెల్లడించారు.

క్రీడాకారులు ఈషాసింగ్​, నిఖత్​ జరీన్​, సిరాజ్​కు 600 గజాలు చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. విధుల్లో చనిపోయిన రాజీవ్​ రతన్​ కుమారుడికి మున్సిపల్ కమిషనర్​ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. మరో అధికారి మురళి కుమారుడికి గ్రూప్​-1 ఉద్యోగం ఇవ్వనున్నట్లు వివరించారు.

"ఇద్దరు ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్​కు మళ్లీ ప్రతిపాదనలు పంపుతున్నాం. కోదండరాంరెడ్డి, అమీర్​ అలీఖాన్​ పేర్లను మరోసారి గవర్నర్​కు పంపాలని నిర్ణయించాం. నిజాం చక్కెర పరిశ్రమ పునరుద్ధరణకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. నగరంలో మూసీ సుందరీకరణకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. గోదావరి జలాలను హైదరాబాద్​ జంట జలాశయాలకు తరలిస్తాం. మల్లన్న సాగర్​ నుంచి జంట జలాశయాలకు గోదావరి జలాలు తరలిస్తాం." అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి స్పష్టం చేశారు.

" జాబ్​ క్యాలెండర్​ను అసెంబ్లీలో విడుదల చేస్తున్నాము. త్వరలో తెల్ల రేషన్​కార్డులు ఇచ్చే ప్రారంభం. అలాగే పేదలకు రేషన్​ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు ఇస్తాము. క్రీడాకారులు ఈషాసింగ్​, నిఖత్​ జరీన్, సిరాజ్​లకు 600 గజాల చొప్పున ఇంటి స్థలం.కోదండరాంరెడ్డి, అమీర్​ అలీఖాన్​ పేర్లను మరోసారి గవర్నర్​కు పంపాం. ఎమ్మెల్సీలుగా నియామకం కోసం. గౌరవెల్లి ప్రాజెక్టు త్వరిత గతిన పూర్తి కావడానికి అధిక మొత్తం కేటాయించాం." - పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, మంత్రి

గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తికి రూ.437 కోట్లు నిధులు : గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్​ పనుల పూర్తి కోసం నిధులు కేటాయించనున్నారు. ఇందుకు రూ.437 కోట్లు విడుదలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గౌరవెల్లి ప్రాజెక్టుకు నిధుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్​ ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్​ నిర్ణయంపై మంత్రి పొన్నం ప్రభాకర్​ హర్షం వ్యక్తం చేశారు.

జీహెచ్​ఎంసీ ఔటర్​ గ్రామాల విలీనానికి సబ్​ కమిటీ : జీహెచ్​ఎంసీలో ఔటర్​ గ్రామాల విలీనానికి కేబినెట్​ సబ్​ కమిటీని నియమించారు. జీహెచ్​ఎంసీ విలీన కమిటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్​, సీతక్క, శ్రీధర్​ బాబు సభ్యులుగా ఉండనున్నారు. రైతు భరోసా విధివిధానాలపై కేబినెట్​ భేటీలో చర్చించారు. ఈ సమావేశం అనంతరం రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం మీర్​ఖాన్​పేటలో స్కిల్​ డెవలప్​మెంట్​ యూనివర్సిటీ శంకుస్థాపనకు సీఎం రేవంత్​, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్​ బాబు, శాసనసభ స్పీకర్​ గడ్డం ప్రసాద్​ వెళ్లారు.

త్వరలో జాబ్​ క్యాలెండర్​ - 2 లక్షల ఉద్యోగాల భర్తీ : మంత్రి శ్రీధర్​బాబు - JOB CALENDER IN TELANGANA

నిరుద్యోగులకు గుడ్​న్యూస్ - ఇక నుంచి ప్రతి ఏటా ఉద్యోగ జాతరే! - మరో వారంలో జాబ్ క్యాలెండర్ - TELANGANA JOB CALENDAR

Last Updated : Aug 2, 2024, 6:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.