Students fall ill due to Food Poison :సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పరిధిలోని కల్హేర్ గ్రామంలో బీబీపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం అనంతరం విద్యార్థులు ఒకరి తర్వాత మరొకరు వాంతులు చేసుకోవడంతో ఫుడ్ పాయిజన్ అయినట్లు ఉపాధ్యాయులు గుర్తించారు.
ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ - 24 మంది విద్యార్థులకు అస్వస్థత
Published : Aug 12, 2024, 8:19 PM IST
Students fall ill due to Food Poison (ETV Bharat)
దీంతో విద్యార్థులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకోగా మధ్యాహ్నం భోజనంలో ఉడకబెట్టిన కోడి గుడ్డు తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ అయిందని ఆరోపించారు.