Huge Crowd at Khairatabad Metro Station : హైదరాబాద్ నగరంలోని వినాయక నిమజ్జనం వేళ రద్దీ విపరీతంగా పెరిగింది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చిన భక్తులు తిరుగుపయనం కావడంతో మెట్రో స్టేషన్లో రద్దీ భారీగా పెరిగింది. దీంతో ఖైరతాబాద్ స్టేషన్పైన కూడా ఫ్లాట్ఫాంలన్నీ నిండిపోయాయి. ఈ క్రమంలో మెట్రో సిబ్బంది స్టేషన్ మెట్ల వద్ద లోనికి ప్రవేశించే గేట్లను మూసివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత రద్దీ తగ్గాక మళ్లీ గేట్లు తెరిచి కొంతమందిని లోనికి పంపించిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, బస్టాప్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.
ప్రయాణికులతో కిక్కిరిసిన ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ - గేట్లు మూసివేత
Published : Sep 17, 2024, 3:08 PM IST
|Updated : Sep 17, 2024, 3:26 PM IST
Huge Crowd at Khairatabad Metro Station : హైదరాబాద్ నగరంలోని వినాయక నిమజ్జనం వేళ రద్దీ విపరీతంగా పెరిగింది. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చిన భక్తులు తిరుగుపయనం కావడంతో మెట్రో స్టేషన్లో రద్దీ భారీగా పెరిగింది. దీంతో ఖైరతాబాద్ స్టేషన్పైన కూడా ఫ్లాట్ఫాంలన్నీ నిండిపోయాయి. ఈ క్రమంలో మెట్రో సిబ్బంది స్టేషన్ మెట్ల వద్ద లోనికి ప్రవేశించే గేట్లను మూసివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత రద్దీ తగ్గాక మళ్లీ గేట్లు తెరిచి కొంతమందిని లోనికి పంపించిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, బస్టాప్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.