Amrapali Appoint As GHMC Commissioner : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఆమ్రపాలిని పూర్తిస్థాయిలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా ఉన్న ఆమ్రపాలి ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మూసీ నది అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగా కూడా ఆమె ఇప్పటి వరకు అదనపు బాధ్యతల్లో ఉన్నారు.
జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు - రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్లకు స్థానచలనం
Published : Aug 20, 2024, 7:18 PM IST
మూసీ అభివృద్ధి సంస్థ ఎండీగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.దానకిషోర్కు అదనపు బాధ్యతలు కేటాయించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఎండీగా హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా కోట శ్రీవాస్తవను ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఐఏఎస్ అధికారి మయాంక్ మిత్తల్ నియమితులయ్యారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా చాహత్ బాజ్ పాయ్ను నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.