విశాఖలో రైల్వే ట్రాక్పై వ్యక్తి ఆత్మహత్య
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 23, 2024, 4:15 PM IST
Person Suicide on Railway Track in Visakha: విశాఖలో రైల్వే ట్రాక్పై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల, మొండెం రెండు విడిపోయాయి. ఈ ఘటనపై ఎయిర్పోర్టు జోన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే పోలీసులకు ఎయిర్పోర్టు పోలీసులు సమాచారం అందించారు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది తెలియాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అతని పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.