ETV Bharat / snippets

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు - డ్రైవర్ మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

rtc_bus_hit_the_parked_lorry_and_bus_driver_died
rtc_bus_hit_the_parked_lorry_and_bus_driver_died (ETV Bharat)

RTC Bus Hit the Parked Lorry and Bus Driver Died : అనకాపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. ఆగి ఉన్న లారీని ఆర్డీసీ బస్సు ఢీ కొట్టడంతో బస్సు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కసింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై జరిగింది. నర్సాపురం ఆర్టీసీ డిపో నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సు బయ్యవరం వద్దకు రాగానే ప్రమాదవశాత్తు ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆర్డీసీ బస్సు ముందరి భాగం తుక్కుగా మారింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న కసింకోట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RTC Bus Hit the Parked Lorry and Bus Driver Died : అనకాపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. ఆగి ఉన్న లారీని ఆర్డీసీ బస్సు ఢీ కొట్టడంతో బస్సు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన కసింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై జరిగింది. నర్సాపురం ఆర్టీసీ డిపో నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సు బయ్యవరం వద్దకు రాగానే ప్రమాదవశాత్తు ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆర్డీసీ బస్సు ముందరి భాగం తుక్కుగా మారింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న కసింకోట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.