MLA Kunamneni On yadadri temple Development :యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఖర్చు చేసిన రూ.1200కోట్ల పనులు ఎక్కడ జరిగాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. యాదాద్రి అభివృద్ధిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో దళిత హక్కుల పోరాట సమితి శిక్షణ తరగతులను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
Published : Jun 18, 2024, 7:18 PM IST
యాదాద్రి ఆలయ అభివృద్ధి నిధులపై సమగ్ర విచారణ చేపట్టాలి : కూనంనేని
MLA Kunamneni On yadadri temple Development (MLA Kunamneni On yadadri temple Development)
మోదీ, జగన్, కేసీఆర్లు ముగ్గురూ తామే శాశ్వతమనే విధంగా నిరంకుశంగా పరిపాలన చేశారని కూనంనేని ఆరోపించారు. ప్రజలు వీళ్ల ముగ్గురికీ సరైన రీతిలో సమాధానం చెప్పారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ఫొన్ ట్యాపింగ్ చేసిన వారు ఎవరైనప్పటికీ తప్పకుండా శిక్షపడుతుందన్నారు.