ETV Bharat / snippets

'ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచి సంతోషం లేకుండా చేయటమేనా ప్రజా పాలన అంటే'

author img

By ETV Bharat Telangana Team

Published : 14 hours ago

HARISH RAO ON CM REVANTH
Harish Rao on TGSRTC Bus Charges (ETV Bharat)

Harish Rao on TGSRTC Bus Charges : ఆర్టీసీ బస్సు ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రజలకు పండుగ సంతోషం లేకుండా చేయటమేనా ప్రజా పాలన అంటూ సీఎం రేవంత్​రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీమంత్రి హరీశ్​రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికుల ముక్కు పిండి అధిక ధరలు వసూలు చేయటం దుర్మార్గమని మండిపడ్డారు. పండగ కోసం 140 రూపాయలతో జేబీఎస్ నుంచి సిద్దిపేటకు వెళ్లిన వారు, తిరుగు ప్రయాణంలో రూ.200 చెల్లించాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హన్మకొండ నుంచి హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణం సాధారణ రోజుల్లో రూ.300 ఉండేదని, ఇప్పుడు దానిని ప్రభుత్వం రూ. 420కి పెంచిందన్నారు. ఈ మేరకు బస్సు టిక్కెట్ల ఫొటోలను హరీశ్​రావు ఎక్స్​లో పంచుకున్నారు. బస్సుల సంఖ్య పెంచకుండా, టికెట్ ఛార్జీలు పెంచి తెలంగాణ ప్రజలకు పండుగ సంతోషాన్ని లేకుండా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Harish Rao on TGSRTC Bus Charges : ఆర్టీసీ బస్సు ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రజలకు పండుగ సంతోషం లేకుండా చేయటమేనా ప్రజా పాలన అంటూ సీఎం రేవంత్​రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీమంత్రి హరీశ్​రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికుల ముక్కు పిండి అధిక ధరలు వసూలు చేయటం దుర్మార్గమని మండిపడ్డారు. పండగ కోసం 140 రూపాయలతో జేబీఎస్ నుంచి సిద్దిపేటకు వెళ్లిన వారు, తిరుగు ప్రయాణంలో రూ.200 చెల్లించాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హన్మకొండ నుంచి హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణం సాధారణ రోజుల్లో రూ.300 ఉండేదని, ఇప్పుడు దానిని ప్రభుత్వం రూ. 420కి పెంచిందన్నారు. ఈ మేరకు బస్సు టిక్కెట్ల ఫొటోలను హరీశ్​రావు ఎక్స్​లో పంచుకున్నారు. బస్సుల సంఖ్య పెంచకుండా, టికెట్ ఛార్జీలు పెంచి తెలంగాణ ప్రజలకు పండుగ సంతోషాన్ని లేకుండా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.