national

చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో బతికుండగానే పెట్రోల్​ పోసి సజీవ దహనం

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2024, 8:08 PM IST

Man was Killed on Suspicion of Black Magic
Man was Killed on Suspicion of Black Magic (ETV Bharat)

Man was Killed on Suspicion of Black Magic : చేతబడి చేశాడనే అనుమానంతో వరుసకు అన్న అయిన వ్యక్తిని తమ్ముడు సజీవ దహనం చేశాడు. ఈ దారుణ సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్టలో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, కనిమెట్ట గ్రామానికి చెందిన దొడ్ల పెంటన్న గత కొంతకాలంగా గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం దగ్గర గదిలో ఒంటరిగా ఉంటున్నాడు.

కొంతకాలంగా కురుమన్న ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనికి కారణం పెంటన్ననే అని అనుమానంతో పెట్రోల్​ పోసి సజీవ దహనం చేశాడు. గదిలో నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన పెంటన్నను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కురుమన్నపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details