ప్రభుత్వ భూముల వేలంపై హైకోర్టులో పిటిషన్ - విచారణ 8 వారాలకు వాయిదా
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 3, 2024, 9:28 PM IST
High Court Hearing on Govt Land Auction Petition : రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలు, భవనాలు వేర్వేరు పథకాల కోసం ఆక్షన్ వేయటాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ క్రమంలో నూతన ప్రభుత్వం దీనిపై విధానపరమైన నిర్ణయం ఏమైనా తీసుకుంటుందేమో చూద్దామని న్యాయస్థానం అభిప్రాయ పడింది. ఈ సందర్భంగా విచారణను హైకోర్టు వాయిదా వేసింది. దీనిపై వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను న్యాయస్థానం 8 వారాలకు వాయిదా వేసింది.