national

By ETV Bharat Telangana Team

Published : Aug 19, 2024, 2:50 PM IST

ETV Bharat / snippets

రాఖీ పండుగ పూట విషాదం - కరెంటు షాక్‌ తగిలి దంపతులు మృతి

Couple Died Due to Electric Shock
Couple Died Due to Electric Shock (ETV Bharat)

Khammam Couple Died Due to Electric Shock : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బస్వాపురంలో విద్యుత్ షాక్ తగిలి దంపతులు మృతి చెందారు. బస్వాపురం గ్రామంలో బానోతు శ్రీను(45), షమీనా (40) జీవనం సాగిస్తున్నారు. ఉదయం షమీనా బట్టలు ఆరేయడానికి బయటకు వెళ్లింది. తీగపై ఆరేస్తుండగా విద్యుత్‌ షాక్‌ తగలడంతో కేకలు వేసింది. కాపాడటానికి వచ్చిన శ్రీను ఆమెను ముట్టుకోవడంతో ఇద్దరికి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా వీరికి కుమార్తె ఉంది. ఆమెకు వివాహం జరిగిది. అన్యోన్యంగా ఉండే దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details