CM Revanth Pays Tribute to Minister Uttam Father : మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తండ్రి నలమడ పురుషోత్తం రెడ్డి వయోభారంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. ఎంతో మంది యువతకు ఉద్యోగ కల్పన చేసిన పురుషోత్తం రెడ్డి శివైక్యమవడం బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి, మహా ప్రస్థానంలో ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఉత్తమ్కుమార్ రెడ్డికి పితృవియోగం కలగడం పట్ల మంత్రులతో పాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Published : 6 hours ago
ఎంతో మంది యువతకు ఉద్యోగ కల్పన చేసిన పురుషోత్తం రెడ్డి శివైక్యమవడం బాధాకరం : సీఎం రేవంత్
CM Revanth Pays Tribute to Minister Uttam Father (ETV Bharat)
తెలంగాణ, ఏపీ పీసీసీ అధ్యక్షులు మహేశ్కుమార్ గౌడ్, వైఎస్ షర్మిల, కార్పొరేషన్ ఛైర్మన్లు, ఆయా పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తన సోదరులతో కలిసి మంత్రి ఉత్తమ్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతిమయాత్రకు హాజరైన ప్రముఖులు నలమడ పురుషోత్తం రెడ్డితో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.