AP CM Chandrababu Reached at Tirumala :తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. ఈ రాత్రికి చంద్రబాబు కుటుంబసభ్యులతో కలిసి తిరుమలలోనే బస చేయనున్నారు. రేపు ఉదయం 8 గం.కు శ్రీవారి సేవలో చంద్రబాబు, కుటుంబసభ్యులు పాల్గొంటారు. అంతకు ముందు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు తిరుపతి కలెక్టర్ ప్రవీణ్, ఎస్పీ హర్షవర్ధన్ ఘనస్వాగతం పలికారు.
తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు - ప్రోటోకాల్ పాటించని ఇన్ఛార్జి ఈవో
Published : Jun 12, 2024, 10:30 PM IST
![తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు - ప్రోటోకాల్ పాటించని ఇన్ఛార్జి ఈవో Chandrababu visit Tirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-06-2024/1200-675-21698423-thumbnail-16x9-cbn.jpg)
AP CM Chandrababu Reached at Tirumala (ETV Bharat)
సీఎం చంద్రబాబు తిరుమలకు చేరుకున్నప్పటికి, ప్రోటోకాల్ విషయంలో తితిదే అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఆయనకు స్వాగతం పలికేందుకు తితిదే ఇన్ఛార్జి ఈవో వీరబ్రహ్మం వాహనం వద్దకు రాలేదు. సీఎంను అవమానపరిచేలా వ్యవహరించారు. గాయత్రినిలయం భవనం లోపలకు వెళ్లాక, ఇంఛార్జి ఈఓ వీరబ్రహ్మం పూలబొకే ఇచ్చేందుకు యత్నించారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఆ పూలబొకేను తిరస్కరించారు.