రాష్ట్రంలో మరోసారి కిడ్నాప్ కలకలం - జగిత్యాల జిల్లాలో రెండేళ్ల బాలుడి అపహరణ
Published : Aug 14, 2024, 11:33 AM IST
Boy Kidnap in Jagtial District :జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. పట్టణంలోని దుబ్బవాడలో నివాసం ఉంటున్న దంపతులకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అతనుతన అక్కతో కలిసి రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి వెంబడించాడు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత బాలుడి అక్కకు 20 రూపాయలు ఇచ్చి ఏవైనా కొనుక్కోమని చెప్పడంతో ఆ పాప అక్కడి నుండి కిరాణా దుకాణానికి వెళ్లింది. ఇంతలో బాలుడిని బైక్ పై ఎక్కించుకొని గుర్తుతెలియని ఆ వ్యక్తి ఉడాయించాడు. తన తమ్ముడిని ఎత్తుకెళ్లడం చూసిన బాలిక కేకలు వేస్తూ తల్లి దగ్గరకు వచ్చి విషయం చెప్పడంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.