India ICC Trophy:టీమ్ఇండియా చివరిసారిగా ఐసీసీ ట్రోఫీ ముద్దాడి ఆదివారం (జూన్ 23) నాటికి 11 ఏళ్లు పూర్తయ్యింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించిన టీమ్ఇండియా 5వ ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు వన్డే, టీ20 వరల్డ్కప్లు ఆడిన భారత్ 11ఏళ్లుగా ఐసీసీ ఈవెంట్లలో ఛాంపియన్గా నిలవలేకపోయింది. 2014 టీ20 ప్రపంచకప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2023 వన్డే వరల్డ్కప్ టోర్నీల్లో ఫైనల్దాకా చేరినప్పటికీ తుదిపోరులో ఓడి రన్నరప్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
11ఏళ్ల కిందటిదే ఆఖరిది- ఇంకా కొనసాగుతున్న నిరీక్షణ!
Published : Jun 23, 2024, 11:06 AM IST
India Icc Trophy (Source: Getty Images)
కాగా, ప్రస్తుత టీ20 వరల్డ్కప్లో టీమ్ఇండియా అద్భుతంగా రాణిస్తోంది. సూపర్ 8లో రీసెంట్గా బంగ్లాదేశ్పై నెగ్గి సెమీస్ అవకాశాలు మెరుగుపర్చుకుంది. ఈ టోర్నీలో సెమీస్ చేరడంతోపాటు ట్రోఫీ కూడా సాధిస్తుందని భారత్ ఫ్యాన్స్ ధీమాగా ఉంది. ఇదే జరిగితే టీమ్ఇండియా 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెర పడినట్లే!