Bangladesh Squad For T20s: భారత్తో అక్టోబర్ 6న ప్రారంభం కానున్న టీ20 సిరీస్కు బీసీబీ బంగ్లాదేశ్ జట్టును ప్రకటించింది. టీ20ల్లో కూడా నజ్ముల్ హొస్సేన్ షాంటోనే జట్టును నడింపిచనున్నాడు. 14 మందితో కూడిన జట్టును ఆదివారం వెల్లడించింది. ఈ సిరీస్తో మెహదీ హసన్ మిరాజ్ దాదాపు 14నెలల తర్వాత జాతీయ జట్టులోకి రానున్నాడు. ఈ సిరీస్లో భారత్తో బంగ్లా మూడు టీ20 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. కాగా, ఈ సిరీస్కు భారత్ జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.
బంగ్లా జట్టు: నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, లిట్టన్ కుమార్ దాస్, జాకర్ అలీ అనిక్, మెహిదీ హసన్ మిరాజ్, మెహదీ హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మద్, తస్రీకిన్ అహ్మద్, తస్రీకిన్ అహ్మద్ , రకీబుల్ హసన్
తొలి టీ20 | అక్టోబర్ 06 | గ్వాలియర్ |
రెండో టీ20 | అక్టోబర్ 09 | న్యూ దిల్లీ |
మూడో టీ20 | అక్టోబర్ 12 | హైదరాబాద్ |