national

హైకోర్టులో వైఎస్సార్సీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్లు- విచారణ వాయిదా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 10, 2024, 3:42 PM IST

HC_on_YSRCP_Leaders_Petitions
HC_on_YSRCP_Leaders_Petitions (ETV Bharat)

HC on YSRCP Leaders Petitions: తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, ఆ పార్టీ నేత దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్లు వేశారు. 2021 అక్టోబర్​ నెలలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగింది. ఈ ఘటనలో పిటిషనర్లపై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగుదేశం ప్రధాన కార్యాలయంపై దాడి చేయడం చిన్న వ్యవహారం కాదని పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వైఎస్సార్సీపీ నాయకుల ప్రోద్బలంతో ప్రణాళిక ప్రకారమే విధ్వంసం సృష్టించారని, అనేకమందిని గాయపరిచారని కోర్టుకు నివేదించారు.

ABOUT THE AUTHOR

...view details