భూమి కోసం గిరిజన తెగల మధ్య ఘర్షణ- 36మంది మృతి, 162మందికి గాయాలు
Published : Jul 29, 2024, 8:04 AM IST
|Updated : Jul 29, 2024, 8:18 AM IST
Pakistani Tribal Conflict :వాయువ్య పాకిస్థాన్లోని గిరిజన తెగల మధ్య జరిగిన ఘర్షణలో 36మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 162మంది గాయపడ్డారు. అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఖైబర్ పంఖ్తుంక్వాలోని బొషేరా గ్రామంలో చిన్న భూభాగం కోసం రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. గత ఐదు రోజులుగా ఈ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం బొషేరా, మలిఖేల్, దండార్ ప్రాంతాల్లో సైనికులు, ప్రభుత్వ యంత్రాగం, గిరిజన పెద్దల సాయంతో రెండు వర్గాల మధ్య సంధి కదిర్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పారు.