గాజాపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి - 40మంది మృతి- 60మందికి పైగా గాయాలు
Published : Sep 10, 2024, 8:57 AM IST
|Updated : Sep 10, 2024, 10:43 AM IST
Israel Attack On Gaza : గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా గాజా పట్టీలోని మవాసీ ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోయారని, 60 మంది గాయపడ్డారని పాలస్తీనా అధికారిక వర్గాలు తెలిపాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా వేలాది మంది పాలస్తీనా ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఆశ్రయం పొందుతున్నట్టు అధికారులు తెలిపారు. మానవతా జోన్గా గుర్తించిన చోట ఇజ్రాయెల్ చేసిన దాడులపై మండిపడ్డారు. మరోవైపు కమాండ్ -కంట్రోల్ సెంటర్ల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న కీలక హమాస్ మిలిటెంట్ల లక్ష్యాలపై దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఆ ప్రాంతంలో హమాస్ కీలక నేతలు నేతలున్నట్టు ఆధారాలను బయటపెట్టలేదు.