సూర్య, కార్తి మంచి మనసు - వయనాడ్ బాధితుల కోసం ఏం చేశారంటే?
Published : Aug 1, 2024, 3:45 PM IST
Wayanad landslide tragedy Hero Suriya Donates 50Lakhs :వయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని కలిచి వేస్తోంది. ఈ హృదయవిదారక ఘటనలో వందల మంది మృతిచెందారు. దీంతో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. రీసెంట్గా కోలీవుడ్ నుంచి విక్రమ్ రూ.20 లక్షలు విరాళం ప్రకటించగా ఇప్పుడు సూర్య ఫ్యామిలీ కూడా ఇదే చేసింది. సూర్య, జ్యోతిక, కార్తి కలిసి రూ.50 లక్షలను కేరళ సీఎం సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. ఈ ఘటన తమను ఎంతగానో కలచి వేసిందని సూర్య అన్నారు. "ఇది హృదయ విదారక ఘటన. రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. ప్రమాదంలో చనిపోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానుఠ అని విచారం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనపై మాలీవుడ్ ఇండస్ట్రీ కూడా విచారం వ్యక్తం చేసింది. కొన్ని రోజులపాటు సినిమా ఈవెంట్లు, కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది.