Saripodhaa Sanivaaram OTT: నేచురల్ స్టార్ నాని- వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన 'సరిపోదా శనివారం' తాజాగా రూ .100 కోట్ల క్లబ్లో చేరింది. ఇక థియేటర్లలో భారీ విజయం దక్కించుకున్న ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. సెప్టెంబర్ 26 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు యస్ జే సూర్య కీలక పాక్ర పోషించారు. నాని సరసన ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమా రూపొందించారు.