national

By ETV Bharat Telugu Team

Published : Jun 18, 2024, 5:57 PM IST

ETV Bharat / snippets

41 ఎయిర్​పోర్టులకు బాంబు బెదిరింపులు- 'అవన్నీ ఫేక్​'!

Bomb Threats to Several Airports In India
Bomb Threats to Several Airports In India (ANI)

Bomb Threats to Several Airports In India :దేశంలోని పలు ప్రాంతాలకు ఈమెయిల్స్​ ద్వారా వచ్చిన బాంబు బెదిరింపులన్నీ ఫేక్ అని తాజాగా అధికారులు వెల్లడించారు. బిహార్‌, రాజస్థాన్‌, గుజరాత్‌ ఇలా 41 విమానాశ్రయాలకు ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చాయి. దీంతో విషయం తెలుసుకుని అప్రమత్తమైన పోలీసులు, CISF, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, ఆయా ఎయిర్​పోర్ట్​లను ముమ్మరంగా తనిఖీ చేశారు. అంతేకాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పట్నా, జయపుర, వడోదర విమానాశ్రయాల వద్ద భారీగా భద్రను పెంచారు. గత నెలలోనూ ఇదే తరహాలో దిల్లీలోని వందకు పైగా పాఠశాలలు, పలు ఆస్పత్రులకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. తనిఖీల్లోనూ ఎలాంటి అనుమానిత వస్తువులు లభ్యం కాలేదు.

ABOUT THE AUTHOR

...view details