Yogi Adityanath's Bold Claim In JK : జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికలు ముగిసి, అక్కడ భాజపా అధికారంలోకి వచ్చాక పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) కూడా ఆ రాష్ట్రంలో భాగంగా మారుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. పాకిస్థాన్ నుంచి విడిపోతామంటూ పీఓకే ప్రాంత ప్రజలు గొంతెత్తి చెబుతున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో బలమైన సర్కార్ ఉన్న కారణంగా కశ్మీర్లో ఎన్నికలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆర్.ఎస్.పుర ప్రాంతంలో జరిగిన సభలో యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు. పాక్లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు వారు నానా తంటాలు పడుతున్నారని చెప్పారు. పాకిస్థాన్ను మానవత్వానికి శత్రువుగా, మానవాళి పాలిట క్యాన్సర్గా ఆయన అభివర్ణించారు.
'కశ్మీర్ ఎన్నికల తర్వాత PoK మనదే' - యోగి ఆదిత్యనాథ్
Published : 3 hours ago
Yogi Adityanath's Bold Claim In JK : జమ్మూకశ్మీర్ శాసనసభ ఎన్నికలు ముగిసి, అక్కడ భాజపా అధికారంలోకి వచ్చాక పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) కూడా ఆ రాష్ట్రంలో భాగంగా మారుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. పాకిస్థాన్ నుంచి విడిపోతామంటూ పీఓకే ప్రాంత ప్రజలు గొంతెత్తి చెబుతున్నారని ఆయన అన్నారు. కేంద్రంలో బలమైన సర్కార్ ఉన్న కారణంగా కశ్మీర్లో ఎన్నికలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆర్.ఎస్.పుర ప్రాంతంలో జరిగిన సభలో యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు. పాక్లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు వారు నానా తంటాలు పడుతున్నారని చెప్పారు. పాకిస్థాన్ను మానవత్వానికి శత్రువుగా, మానవాళి పాలిట క్యాన్సర్గా ఆయన అభివర్ణించారు.