ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE అనకాపల్లిలో నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం- హజరైన చంద్రబాబు నాయుడు - ప్రత్యక్ష ప్రసారం - Modi Public Meeting Live - MODI PUBLIC MEETING LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 6, 2024, 5:32 PM IST

Updated : May 6, 2024, 6:10 PM IST

Modi Public Meeting Live: అనకాపల్లి ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగుదేశం అధినేత  నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడని నేతలు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని నరేంద్ర మోదీ కోరారు. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు సమయంలో అభివృద్ధిలో నెంబర్‌వన్‌గా ఉండేది. జగన్ ఐదేళ్ల హయాంలో పాలన పట్టాలు తప్పింది. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులఊబిలో నెట్టింది. వైసీపీ పాలనలో అభివృద్ధి సున్నా.. అవినీతి వంద శాతం పెరిగింది.  మద్యనిషేధం పేరు చెప్పి జగన్‌ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక మద్యం సిండికేట్‌గా తయారయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జెట్ స్పీడ్‌తో పరిగెత్తింది. మూడు రాజధానులు చేస్తామన్నారు.. ఒక్కటీ చేయలేదు. మూడు రాజధానులు పేరిట ఏపీని లూటీ చేశారు. వైసీపీ అవినీతి నిర్వహణ తప్ప.. ఆర్థిక నియంత్రణ తెలియదు. రాష్ట్ర ఖజానాను వైసీపీ ప్రభుత్వం ఖాళీ చేసింది. పోలవరానికి కేంద్రం రూ.15 వేల కోట్లు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఆపేసిందని  నరేంద్ర మోదీ తెలిపారు. 
Last Updated : May 6, 2024, 6:10 PM IST

ABOUT THE AUTHOR

...view details