ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మన్యం జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత - ఒక వ్యక్తి అరెస్ట్ - Police Seized Ganja

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 8, 2024, 8:56 PM IST

police_seized_ganja (ETV Bharat)

Police Seized Ganja being Smuggled in Parvathipuram Manyam : పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం బాగువలస సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 87.29 కేజీల గంజాయిని సాలూరు రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని ఆంధ్ర- ఒడిశా సరిహద్దు నుంచి సాలూరు మీదుగా పశ్చిమ బెంగాల్​కి బోలెలో వాహనములో అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు ఆ గంజాయి వాహనాన్ని బాగువలస సమీపంలో పట్టుకున్నారు. వాహన డ్రైవర్ బలేస్తర్ సింగ్​ను (42) అదుపులోకి తీసుకొని అతని దగ్గర నుంచి 87.29 కేజీల గంజాయి, ఒక సెల్ ఫోన్, 15000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారణ చేయగా మరో నిందితుడు ఉన్నట్టు తేలింది. అతని పట్టుకోడం కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని ఏఎస్పీ సునీల్ శిరోన్ తెలిపారు. నిందుతులపై పలు సెక్షన్ల కేసులు నమోదు చేసి రిమాండ్​కి పంపించినట్లు ఏఎస్పీ సునీల్ శిరోన్ తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details