ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 6:55 PM IST

ETV Bharat / videos

కడపలో ఎర్రచందనం స్మగ్లింగ్​ - ఇద్దరు కానిస్టేబుళ్ల ప్రమేయం ! - Seized Sandalwood Smuggling Car

Police Arrest Sandalwood Smugglers in Kadapa : కడప జిల్లా బస్వాపురం టోల్ గేట్ వద్ద  గురువారం టాస్క్ ఫోర్స్, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కారులో ఎర్రచందనం తరలిస్తూ ముగ్గురు స్మగ్లర్లు పట్టుబడ్డారు. అధికారులు వారి నుంచి కొన్ని ఎర్రచందనం దుంగలు, తరలిస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ స్మగ్లింగ్ కేసులో బద్వేల్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్ల​కు సంబందాలు ఉన్నాయనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం ఎర్రచందనం దుంగలను, కారును బద్వేలు అటవీశాఖ కార్యాలయానికి తరలించామని తెలిపారు. ఎర్రచదనం దుంగలు, కారును పట్టుకునే సమయంలో ఇద్దరు స్మగ్లర్లు పారిపోయినట్లు సమాచారం. డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్న అధికారులు అతడికి కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, స్మగ్లింగ్ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను తెలియాల్సి ఉందని  అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details