ఆంధ్రప్రదేశ్

andhra pradesh

LIVE: మూడో రోజు నారా లోకేశ్ శంఖారావం సభ - ప్రత్యక్ష ప్రసారం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 10:28 AM IST

Updated : Feb 13, 2024, 12:01 PM IST

nara_lokesh_shankharavam

Nara Lokesh Shankaravam: తొలి రెండు రోజుల కంటే రెట్టింపు ఉత్సాహంతో నారా లోకేశ్ శంఖారావం యాత్ర నేడు కొనసాగుతోంది. పాతపట్నం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో లోకేశ్ పర్యటిస్తున్నారు. నేడు ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో లోకేశ్ శంఖారావం సభలు నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో ఎన్నికల సన్నద్ధతపై పార్టీ క్యాడర్‌కు లోకేశ్​ దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ కేడర్​తో లోకేశ్ ముఖాముఖిలు నిర్వహిస్తూ, సూపర్ - 6 కిట్లను అందజేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ కేడర్​తో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. 

సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని కార్యోన్ముఖులను చేయటంతో పాటు జగన్ పీడిత వర్గాలన్నింటికీ భరోసా కల్పించేలా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్రకు సిద్ధమైన విషయం తెలిసిందే. అధికార పార్టీ నేతల అరాచకాలను ఎండగడుతూ, తాము అధికారంలోకి రాగానే అభివృద్ధిని ఎలా పరుగులు పెట్టిస్తామనేది వివరిస్తున్నారు. రెండో రోజు శ్రీకాకుళం జిల్లాలో లోకేశ్ శంఖారావం యాత్ర కొనసాగింది. నేడు పాతపట్నం, పాలకొండ, కురుపాంలో శంఖారావం సభలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సన్నద్ధతపై పార్టీ క్యాడర్‌కు లోకేశ్ దిశానిర్దేశం చేస్తున్నారు. లోకేశ్ శంఖారావం యాత్ర ప్రత్యక్ష ప్రసారం మీ కోసం. 

Last Updated : Feb 13, 2024, 12:01 PM IST

ABOUT THE AUTHOR

...view details