LIVE ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు- విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారం - 6TH TELUGU WRITERS CONFERENCE LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 28, 2024, 4:16 PM IST

Updated : Dec 28, 2024, 5:37 PM IST

6th Telugu Writers Conference LIVE : మాతృ భాషను భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా.. ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌ జ్యోతి ప్రజ్వలన చేశారు. అంతకుముందు వీరు తెలుగు తల్లి విగ్రహానికి అంజలి ఘటించారు. ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, మండలి బుద్ధ ప్రసాద్‌, విశ్వహిందీ పరిషత్తు జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, ఈనాడు ఏపీ సంపాదకుడు ఎం. నాగేశ్వరరావు, తెలంగాణ శాసనమండలి సభ్యుడు, కవి గోరటి వెంకన్న, సినీ గేయ కవి భువనచంద్ర, ఆచార్య కొలకలూరి ఇనాక్‌ తదితరులు మహాసభల్లో పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగు మహనీయుల ఫొటో ప్రదర్శనను అతిథులు తిలకించారు. శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే సుజనాచౌదరి, మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజా కిరణ్‌ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.ప్రస్తుతం ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగుతున్నాయి. ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Dec 28, 2024, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.