తెలంగాణ

telangana

ETV Bharat / videos

భారీగా డబ్బులు ఆశ చూపి కిడ్నీ మాయం - ఎస్పీకి బాధితుడి ఫిర్యాదు - KIDNEY RACKET MAFIA GANG BUSTED

By ETV Bharat Telangana Team

Published : Jul 8, 2024, 7:00 PM IST

Kidney Racket Gang Frauds in Vijayawada : ఏపీలోని విజయవాడ కేంద్రంగా కిడ్నీ రాకెట్‌ ముఠా మోసాలు మరోసారి వెలుగు చూశాయి. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ కోసం కిడ్నీ విక్రయానికి ఒప్పుకుంటే, కిడ్నీ తీసుకుని తనను మోసం చేశారంటూ గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు అనే వ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కిడ్నీ ఇస్తే రూ.30 లక్షలు ఇస్తామని చెప్పి విజయవాడలోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్‌ పూర్తయ్యాక ఖర్చులకు మాత్రమే రూ.లక్షా పది వేలు ఇచ్చారని వాపోయాడు. 

మిగిలిన డబ్బులు ఇవ్వాలని అడిగితే నోటికి వచ్చినట్లు తిడుతూ నీకు చేతనైంది చేసుకోమని బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనలాగే అమాయకులకు డబ్బు ఆశ చూపి నెలకు ఐదు నుంచి 10 మందికి కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నారని మధుబాబు ఆరోపించారు. ఆపరేషన్ తర్వాత తన భర్త ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందని, తన కుటుంబానికి, పిల్లలకు న్యాయం చేయాలని మధుబాబు భార్య శైలజ కన్నీటి పర్యంతమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details