తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 12:50 PM IST

ETV Bharat / videos

నెయ్యి లోడుతో వెళ్తున్న లారీకి ప్రమాదం- సంచుల్లో ప్యాకెట్లు సర్దేసిన వాహనదారులు

Ghee Packets Loot  In Jhansi : ప్రమాదానికి గురైన లారీ నుంచి నెయ్యి ప్యాకెట్లు ఎత్తుకెళ్లిపోయారు వాహనదారులు. ప్యాకెట్లను సంచుల్లో వేసుకుని తీసుకెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కొంతమందిని అడ్డుకున్నారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ ఝాన్సీలోని సిప్రి బజార్ పోలీస్​ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగింది.

ఇదీ జరిగింది
ఝాన్సీలోని ఓ ఫైనాన్స్​ కంపెనీ ట్రక్కులను ఆపి తనిఖీ చేస్తోంది. అందులో భాగంగా నెయ్యి లోడ్​తో దిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న లారీని ఆపారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఆపి ఉంచిన లారీని ఓ ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టిందని డ్రైవర్ రాహుల్ తెలిపాడు. దీంతో కంటైనర్​లో ఉన్న నెయ్యి ప్యాకెట్లు కిందపడ్డాయి. అందులో కొన్ని పగిలిపోయాయి. ఇది గమనించిన అటుగా వెళ్తున్న వాహనదారులు నెయ్యి ప్యాకెట్లను చోరీ చేశారు. ప్లాస్టిక్​, గోనె సంచుల్లో నెయ్యి ప్యాకెట్లను వేసుకొని ఎత్తుకెళ్లిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నెయ్యి ప్యాకెట్లను తీసుకెళ్తున్న కొంత మందిని అడ్డుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details