తెలంగాణ

telangana

ప్రజాభవన్‌లో బోనాల ఉత్సవాలు - పాల్గొన్న సీఎం రేవంత్‌, మంత్రులు - Bonalu celebrations at Praja Bhavan

By ETV Bharat Telangana Team

Published : Jul 14, 2024, 2:15 PM IST

Bonalu celebrations at Praja Bhavan (ETV Bharat)

Bonalu celebrations At Praja Bhavan :  ప్రజా భవన్ లో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణి నందిని , మంత్రి కొండా సురేఖ తలపై బోనాలను ఎత్తుకుని ప్రజాభవన్ లోని నల్లపోచమ్మకు సమర్పించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి  సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఘటాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్వయంగా తీసుకు వచ్చి శివసత్తులకు అందించారు.

CM Revanth Reddy Attends Bonalu Celebrations : అనంతరం ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా పండితులు సీఎం సహా మంత్రులకు ఆశీర్వచనం అందించారు. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరం పసుపు, కుంకుమలు అద్దుకుంటుంది. వేప వాసనలతో ఊరువాడ డప్పు చప్పుళ్లతో మురిసిపోతుంది. దశాబ్దాలుగా సాగుతున్న బోనాల వేడుకలు ఈనెల 7న గోల్కొండలో వైభవంగా ప్రారంభమయ్యాయి. కోటపై స్వయంభుగా వెలిసిన శ్రీ జగదాంబిక అమ్మకు భక్తులు వైభవంగా బోనాలను సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details