Published : Apr 10, 2024, 7:46 PM IST
కేటీఆర్ అధికారం పోయిన ఫ్రస్టేషన్లో ఉన్నారు : మహేశ్వర్ రెడ్డి - BJP Maheshwar Reddy fires KTR
BJP Maheshwar Reddy fires on KTR : ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదని, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిని అవుతానని కలలు కని, అధికారం పోయిందనే ప్రస్టేషన్లో కేటీఆర్ ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. ధరణి, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం చేయని కుంభకోణంలేదని ఆయన విమర్శించారు. చేసిన తప్పులకు కేటీఆర్ జైలుకు వెళ్లే అవకాశం ఉందని, అందుకే పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. జైలులో కనీస సౌకర్యాలు లేక బాధపడుతున్నట్లు కవిత చెప్పిందని, అందుకే మెంటల్ ఆసుపత్రికి వెళ్లడానికి కేటీఆర్ నిర్ణయించుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. జైలు కంటే, ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి మంచిదని అందులో అన్ని సౌకర్యాలు ఉంటాయని మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్ మాటలు వింటుంటే జాలీ వేస్తోందని, అతనిపై జాలీ చూపడం తప్ప మరేమి చేయలేమని వెల్లడించారు.