తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి హుండీ లెక్కింపు - 22 రోజుల్లో రూ. కోటి 77 లక్షలకు పైగా ఆదాయం - Baddi Pochamma Temple

Yadadri Hundi Counting : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ హుండీని అధికారులు భక్తుల సమక్షంలో లెక్కించారు. గత ఇరవై రెండు రోజుల్లో భక్తులు ఇచ్చిన కానుకలను లెక్కించిన ఆలయ అధికారులు సుమారుగా కోటి 77లక్షలకు పైగా నగదు రూపంలో ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. అంతేకాకుండా బంగారం, వెండి ఇతర దేశాల కరెన్సీ కూడా భక్తులు యాదాద్రీశునికి సమర్పించారు.

Devotees Rush at Vemulawada Baddi Pochamma
Yadadri Hundi Counting

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2024, 9:33 PM IST

Updated : Feb 20, 2024, 9:58 PM IST

యాదాద్రి హుండీ లెక్కింపు - 22 రోజుల్లో రూ. కోటి 77 లక్షలకు పైగా ఆదాయం

Yadadri Hundi Counting : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ హుండీని అధికారులు భక్తుల సమక్షంలో లెక్కించారు. శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో మొత్తం 22 రోజుల్లో రూ. కోటి 77 లక్షల 99 వేల 734 రూపాయలను నగదను భక్తులు కానుకుల రూపంలో నరసింహ స్వామికి సమర్పించారని ఆలయ అధికారులు పేర్కొన్నారు.

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా ఊంజల్ సేవ

నగదుతో పాటు 99 గ్రాముల మిశ్రమ బంగారం, 4.170 కిలో గ్రాముల మిశ్రమ వెండి సమర్పించారు. అలాగే విదేశీ కరెన్సీ రూపంలో 397 అమెరికన్‌ డాలర్లు, 20 యూఏఈ దిర్హామ్స్‌, 70 ఆస్ట్రేలియా డాలర్స్‌, కువైట్ 20 దినార్, ఇంగ్లాండ్ 5 పౌండ్స్, యూరోప్ 15 యూరోస్, మలేసియా 1 రింగిట్స్, న్యూజిలాండ్ 50 డాలర్స్, నేపాల్ 10 రూపీస్, 5 ఖతార్‌ రియల్స్, హుండీల్లో కానుకల రూపంలో వచ్చాయి. వీటిని ఆలయ ఖజానాలో జమచేశామని దేవస్థాన ఈవో రామకృష్ణారావు తెలిపారు.

యాదాద్రిపుణ్యక్షేత్రంలో ప్రధాన, అనుబంధ ఆలయాలలో హరి,హరుల ఆరాధనలు ఆయా ఆలయాల ఆచారంగా కొనసాగాయి. ప్రధానాలయంలో వైష్ణవ పద్ధతిలో పాంచారాత్రాగమ శాస్త్రరీత్యా పంచనారసింహులను కొలుస్తూ, నిత్య పూజలు నిర్వహించారు. మూలవరులను మేల్కొల్పి, హారతి సమర్పించి నిజాభిషేకం, తులసి అర్చన చేపట్టారు. మహాముఖ మండపంలో యజ్ఞ మూర్తులకు అష్టోత్తరం, స్వర్ణ పుష్పార్చనలు కొనసాగించారు.

గత ఇరవై రోజుల యాదాద్రీశుని ఆదాయం ఎంతో తెలుసా..

Devotees Rush at Vemulawada Baddi Pochamma Temple : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లడానికి ముందు ఆనవాయితీ ప్రకారం సోమవారం తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు మంగళవారం బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా వారు తెల్లవారుజామునే భక్తి శ్రద్ధలతో నైవేద్యం వండి బోనం తయారుచేసి ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. బద్ది పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భారీ సంఖ్యలో జనం తరలి రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. అమ్మవారి దర్శనానికి సుమారు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. అమ్మవారి దర్శనానికి భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

యాదాద్రీశుని హుండీ లెక్కింపు.. 21 రోజుల్లో కోటీ 72 లక్షల ఆదాయం..

యాదాద్రి పాతగుట్టలో ముగిసిన అధ్యయనోత్సవాలు - రేపటి నుంచి 25 వరకు బ్రహ్మోత్సవాలు

Last Updated : Feb 20, 2024, 9:58 PM IST

ABOUT THE AUTHOR

...view details