While Drawing Water From the Well Two Fell Into it and Died in Srikakulam : కార్తిక పౌర్ణమి రోజున ఒక పాము ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఇద్దరు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ విషాద ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం కనిమెట్ట గ్రామంలో చోటుచేసుకుంది. అసలు ఇంతకు ఏం అయిందంటే?
కార్తిక పౌర్ణమి రోజున శుక్రవారం రాత్రి గ్రామంలోని రఘుపతి మధుసూదన్ రావు అనే వ్యక్తి ఇంట్లోకి పాము వచ్చింది. దీంతో ఇంట్లో అందరు కేకలు పెట్టారు. ఈ క్రమంలోనే మధుసూదన్ రావు ఆ పామును చంపేందుకు ప్రయత్నించాడు. కర్రతో ఓ దెబ్బ కొట్టాడు. అనంతరం ఆ పాము తప్పించుకుని అక్కడే ఉన్న బావిలో పడిపోయింది. నీళ్లలో పడేసరికి ఇంట్లో అందరూ కంగారు పడ్డారు. శనివారం ఉదయం బావి నుంచి నీటిని తోడేయాలని నిర్ణయించారు.
ఈ 'పాము'ను మీరెప్పుడైనా తిన్నారా? - ఒక్కసారి రుచి చూస్తే ఇక వదిలిపెట్టరు!