ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 10, 2024, 2:51 PM IST

ETV Bharat / state

పంచాయతీ కార్యదర్శి టూ సివిల్స్- 5వ ప్రయత్నంలో 50వ ర్యాంక్​తో విజయం - Vaasanthi Ananthapur success story

Vaasanthi of Ananthapur Bagged 50th Rank in Civil Services : సివిల్స్‌లో ర్యాంకు సాధించాలని చాలామంది ప్రయత్నిస్తారు. అందుకోసం ఏళ్ల తరబడి సాధనలోనే నిమగ్నమవుతుంటారు. అలాంటిది ఒకపక్క ఉద్యోగం చేస్తూనే చిన్ననాటి కల కోసం పట్టుదలతో శ్రమించింది వాసంతి. జాతీయ స్థాయిలో ఐఎఫ్​ఎస్​ (IFS) 50వ ర్యాంకు సొంతం చేసుకుంది.

vaasanthi_of_ananthapur_bagged_50th_rank_in_civil_services
vaasanthi_of_ananthapur_bagged_50th_rank_in_civil_services (ETV Bharat)

Vaasanthi of Ananthapur Bagged 50th Rank in Civil Services : పెళ్లి చేసుకోకుండా ఇంకెన్నాళ్లు చదువుతావంటూ తెలిసినవారు సలహాలిస్తున్నా వారి మాటలను లక్ష్యపెట్టలేదు ఈ యువతి. గమ్యాన్ని చేరుకోవాలనే ఈమె పట్టుదల ముందు అవన్నీ చిన్నబోయాయి. ఆరేళ్ల పాటు వైఫల్యాలకు ఎదురీది చివరికి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పుడు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టావంటూ విమర్శించిన వారి నోటితోనే ప్రశంసలు అందుకుంటోంది.


ఉద్యోగం చేస్తూనే ఐఎఫ్​ఎస్​ సాధించిన వాసంతిది శ్రీసత్యసాయి జిల్లాలోని గౌనివారిపల్లి. తండ్రి గోవిందరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైరయ్యారు. తల్లి ఉషారాణి. హైస్కూల్‌ వరకూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుంది వాసంతి. ఫార్మా-డి పూర్తికాగానే హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలో ఎబీఏ కోర్సులో చేరింది. తర్వాత యూనివర్సిటీలో పరిచయమైన స్నేహితుల ప్రోత్సాహంతో యూపీఎస్సీ కోసం సన్నద్ధం కావటం మొదలుపెట్టింది.

'హైదరాబాద్‌ యూనివర్సిటీలో చేరాక సివిల్స్‌ సాధించాలనే లక్ష్యం మరింత బలపడింది. స్నేహితులు ఇచ్చిన ధైర్యంతో సాధన ప్రారంభించినా లక్ష్యాన్ని చేరేందుకు ఆరేళ్లకు పైగా నిరీక్షించాను. 2017 నుంచి సివిల్స్‌తో పాటుగా ఏపీపీఎస్సీ (APPSC) పరీక్షలకూ ఒకేసారి సన్నద్ధమయ్యాను. తొలి ప్రయత్నంలోనే గ్రూప్‌-1 ఉద్యోగావకాశం తృటిలో చేజారినా నిరాశపడలోదు. రెట్టించిన ఉత్సాహంతో కష్టపడి 2019లో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించాను.'ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నావ్‌ కదా మళ్లీ సివిల్స్‌ కోసం ఇంత కష్టపడటం అవసరమా? అని కొందరు ప్రశ్నించేవారు అలాంటి సమయంలో తల్లిదండ్రులు, సహోద్యోగులే నాకు అండగా నిలిచారు. చివరికి 2023లో నిర్వహించిన ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసులో ఆలిండియా 50వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. -వాసంతి, ఐఎఫ్‌ఎస్‌ ర్యాంకర్‌

పట్టుదల, కృషి - అద్భుతాలు సృష్టిస్తున్న వారిజ నేత్ర విద్యాలయ విద్యార్థులు - VARIJA NETRA VIDYALAYA

కొవిడ్‌ సమయంలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ సివిల్స్‌ సాధన కొనసాగించడం వాసంతికి సవాల్‌గా మారింది. రోజులో దొరికిన కాస్త సమయంలోనే ప్రణాళిక ప్రకారం చదువుతూ సన్నద్ధత కొనసాగించింది. 2021లో ఐఎఫ్​ఎస్​ ఇంటర్వ్యూ వరకూ వెళ్లి కొద్దిలో ఉద్యోగాన్ని చేజార్చుకుంది. మళ్లీ ప్రయత్నించినా 2022లో మెయిన్స్‌లోనే వెనుదిరిగింది. ఇలా వరస వైఫల్యాలు నేర్పిన పాఠాలతో ఐదోసారి ఐఎఫ్​ఎస్​లో ఆలిండియా 50వ ర్యాంకు సాధించింది వాసంతి.


ఆరేళ్ల నుంచి వరుసగా సివిల్స్‌లో విఫలమవుతున్నా ధైర్యం కోల్పోకుండా తమ కుమార్తె కష్టపడి చదివిందని అంటున్నారు వాసంతి తల్లిదండ్రులు. ఊహించినట్టే నమ్మకాన్ని నిలబెట్టిందని ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎదురుదెబ్బలు తగిలినా ఆశయసాధనలో ముందుకుసాగి విజేతగా నిలిచింది వాసంతి. ఓటములే అవకాశాలుగా మలుచుకుని, లక్ష్యం కోసం పోరాడితే తప్పక విజయం దక్కుతుందని సూచిస్తోంది.

ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తూ - తైక్వాండోలో రాణిస్తున్న విజయవాడ అమ్మాయి - Taekwondo pavani sai

ABOUT THE AUTHOR

...view details