తెలంగాణ

telangana

ETV Bharat / state

మందుబాబు వీరంగం : పక్కకు జరగమన్న పాపానికి మహిళా కండక్టర్, డ్రైవర్​పై విచక్షణారహితంగా దాడి - DRUNKARD ATTACKED RTC CONDUCTOR

దుర్భాషలాడుతూ కండక్టర్​పై దాడి - చుట్టుపక్కల వాళ్లు ఆపినా ఆగని మందుబాబు - వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు - రిమాండ్​కు తరలింపు

ATTACKS ON APSRTC EMPLOYEES
DRUNKARD ATTACKED RTC FEMALE CONDUCTOR (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 16, 2024, 1:08 PM IST

Attacks on RTC Employees : మద్యం తాగి ఓ వ్యక్తి ఏపీఎస్​ ఆర్టీసీ డ్రైవర్‌, మహిళా కండక్టర్‌లపై దాడికి దిగాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని జరుగుమిల్లి మండలం కామేపల్లిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితురాలు తెలిపిన కథనం ప్రకారం, ఒంగోలు నుంచి జరుగుమల్లి మండలం వర్థినేనిపాలేనికి ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు బయలుదేరింది. టంగుటూరు, జరుగుమల్లి మార్గంలో కామేపల్లి విగ్రహాల కూడలికి చేరుకోగానే ప్రయాణికులు బస్సు దిగుతున్నారు.

ఈ క్రమంలో కామేపల్లికి చెందిన పత్తిపాటి హరి బాబు అనే వ్యక్తి అప్పటికే పూటుగా మద్యం తాగి ఉన్నాడు. తాగిన మైకంలో రోడ్డుపై పలువురితో గొడవ చేస్తున్నాడు. అదే సమయంలో ప్రయాణికులు దిగిడానికి డ్రైవర్‌ బస్సు ఆపాడు. ప్రయాణికులు దిగిన తర్వాత కండక్టర్‌ సుభాషిణి డ్రైవర్‌కు రైట్‌ చెప్పింది.

భౌతిక దాడి : ఈ క్రమంలో హరిబాబు ఆర్టీసీ బస్సు సమీపానికి వచ్చి నిల్చున్నాడు. పక్కకు వెళ్లాలని కండక్టర్‌ సుభాషిణి సూచించింది. ఇంతలోనే కండక్టర్‌ను బూతులు తిడుతూ అసభ్యకరంగా మాట్లాడాడు. అనంతరం బస్సు టైర్ కింద పడుకొని ముందుకు కదలకుండా నానా హంగామా చేశాడు. సుభాషిణిని బస్సు చుట్టూ వెంబడిస్తూ కొట్టాడు.

అనంతరం ఆగకుండా రెచ్చిపోయి కాళ్లతో తన్నుతూ దుర్భాషలాడాడు. స్థానికంగా ఉన్న వారు అడ్డు చెప్పినా వినకుండా దాదాపు గంట సేపు నడి రోడ్డుపై వీరంగం సృష్టించాడు. బస్సు డ్రైవర్‌ దిగి వచ్చి అడ్డుకోడానికి ప్రయత్నం చేశారు. దీంతో డ్రైవర్‌పై కూడా తిరగబడి కొట్టాడు. అడ్డు వచ్చిన స్థానికులను ఇష్టారీతిన తిడుతూ దాడి చేశాడు. కండెక్టర్‌ సెల్‌ ఫోన్‌ తీసుకొని నేలకు కొట్టాడు.

కేసు నమోదు :ఈ విషయం తెలుసుకున్న జరుగుమల్లి పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న హరిబాబును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్‌కు తరలించారు. గాయపడిన మహిళా కండక్టర్‌ సుభాషిణిని 108 వాహనంలో నెల్లూరు జిల్లా కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సింగరాయకొండ సీఐ హజరత్తయ్య తెలిపారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఆర్టీసీ బస్టాండులో బ్లేడ్​ బ్యాచ్​ అరాచకాలు - ఉద్యోగులకు గాయాలు

సీనియర్​ సిటిజన్లకు గుడ్​న్యూస్​ : ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే - ఏపీఎస్​ఆర్టీసీ బస్సుల్లో 25% రాయితీ

ABOUT THE AUTHOR

...view details