తెలంగాణ

telangana

వీకెండ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? తక్కువ ధరకే రెండు రోజుల యాత్ర- యాదాద్రి దర్శనంతో పాటు లక్నవరం బోటింగ్ ఇంకా మరెన్నో! - Kakatiya Heritage Tour Package

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 3:47 PM IST

Kakatiya Heritage Tour Package : మీరు ఈ వీకెండ్ ఏదైనా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. తెలంగాణ టూరిజం మీకోసం ఒక అద్దిరిపోయే టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. తక్కువ ధరలోనే బోటింగ్, యాదాద్రి టూర్​తో పాటు ఉమ్మడి వరంగల్​లోని ప్రముఖ పర్యటక ప్రాంతాలు వీక్షించొచ్చు. ఆ ప్యాకేజీ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

Telangana Tourism Latest Tour Package
Kakatiya Heritage Tour Package (ETV Bharat)

Telangana Tourism Latest Tour Package : వీకెండ్ వచ్చిందంటే చాలు.. చాలా మంది పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు పర్యటక ప్రాంతాలకు టూర్ ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారికోసం.. తెలంగాణ టూరిజం(Telangana Tourism)ఒక సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. అది కూడా చాలా తక్కువ ధరలో హైదరాబాద్ నుంచి ఈ టూర్​ను ఆపరేట్ చేస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే యాదాద్రితో పాటు ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ప్రముఖ పర్యటక ప్రాంతాలను చూసిరావొచ్చు. ఇంతకీ.. ఆ ప్యాకేజీ ఏంటి? ఒక్కొక్కరికి టికెట్ ధర ఎంత? అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తెలంగాణ టూరిజం.. "HYDERABAD-WARANGAL-KAKATIYA-RAMAPPA HERITAGE TOUR" పేరుతో ఈ టూర్​ను ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్​లో ప్రయాణం మొత్తం ఏసీ మినీ కోచ్ బస్సులో ఉంటుంది. రెండు రోజుల పాటు సాగే ఈ టూర్ ప్యాకేజీ ప్రతి శనివారం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. మరి.. ఈ వీకెండ్ టూర్ ప్యాకేజీ ప్రయాణం, ధర వివరాలు చూస్తే..

మొదటి రోజు :

  • ఫస్ట్ డే (శనివారం) మార్నింగ్ 7 గంటలకు హైదరాబాద్ నుంచి ఏసీ మినీ కోచ్ బస్సు స్టార్ట్ అవుతుంది.
  • ఉదయం 8:30 గంటలకు భువనగిరి ఫోర్ట్ చేరుకుంటారు. అక్కడ సందర్శన అనంతరం యాదగిరిగుట్టకు బయల్దేరుతారు.
  • మార్నింగ్ 9:00 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అనంతరం అక్కడ హరిత హోటల్​లో బ్రేక్​ఫాస్ట్ ఉంటుంది.
  • టిఫిన్ అనంతరం 9:45 గంటలకు యాదాద్రి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత 10:30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరుతారు.
  • అనంతరం 11:00 నుంచి 11:30 AM వరకు జైన దేవాలయం సందర్శన ఉంటుంది.
  • ఆ తర్వాత మధ్యాహ్నం 12:00 గంటలకు హస్తకళలకు ప్రసిద్ధి చెందిన పెంబర్తిలో చాలా సేపు ఆగుతారు. అంటే.. ఆ సమయంలో షాపింగ్ చేసుకోవచ్చు.
  • ఆపై 1:30 గంటలకు హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ 1:30 PM నుంచి 4:00 PM వరకు చెక్-ఇన్, భోజన విరామం, విశ్రాంతి ఉంటుంది.
  • ఆ తర్వాత 4:00 PM నుంచి 8:30 PM వరకు.. వెయ్యి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయాన్ని సందర్శిస్తారు. అలాగే.. వరంగల్ ఫోర్ట్ సౌండ్ & లైట్ షో ప్రదర్శనను వీక్షిస్తారు.
  • అనంతరం రాత్రి 9:00 గంటలకు హోటల్‌కి తిరిగి వస్తారు. నైట్ డిన్నర్, బస అక్కడే ఉంటుంది.

రెండో రోజు :

  • సెకండ్ డే(ఆదివారం) మార్నింగ్ టిఫిన్ చేసి 8 గంటలకు రామప్ప టెంపుల్​కు బయల్దేరుతారు.
  • 10:00 AM నుంచి 1:00 PM మధ్యలో రామప్ప ఆలయ సందర్శన, బోటింగ్, భోజనం సదుపాయం ఉంటుంది. అనంతరం లక్నవరం వెళ్తారు.
  • మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య బోటింగ్ సహా లక్నవరం సందర్శన ఉంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి రిటర్న్ అవుతారు.
  • అనంతరం సాయంత్రం 5:00 గంటలకు హన్మకొండలోని హరిత హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ టీ, స్నాక్స్ బ్రేక్ ఉంటుంది.
  • ఆ తర్వాత 5:30 గంటలకు వరంగల్ నుంచి బయల్దేరుతారు. రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవటంతో మీ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధరల విషయానికొస్తే..పెద్దలకు.. 3,449రూపాయలుగా నిర్ణయించారు. పిల్లలకు 2,759 రూపాయలుగా ఉంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 14న శనివారం అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్చేయండి.

ఇవీ చదవండి :

తెలంగాణ టూరిజం వన్డే ప్యాకేజీ - కేవలం రూ.1500 టికెట్​తో జోగులాంబ, అంజన్న దర్శనం, ఇంకా మరెన్నో!

శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్​ వే, బోట్​ జర్నీ! - తెలంగాణ టూరిజం సూపర్​ ప్యాకేజీలు!

ABOUT THE AUTHOR

...view details