AP Floods Effect 2024 : ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరదలు అన్నదాతల పాలిట పెనుశాపంగా మారాయి. వరద ప్రవాహం తగ్గి పైరుకు బదులు ఇసుక మేటలు దర్శనమిస్తుండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంట పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. భారీవర్షాలకు పలుచోట్ల రహదారులు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 5 September 2024
Telangana News Today Live : తెలంగాణ Thu Sep 05 2024 లేటెస్ట్ వార్తలు- ఏపీలో వరద సృష్టించిన బీభత్సం - కర్షకుల కష్టం 'కృష్ణా'ర్పణం - AP FLOODS EFFECT 2024
Published : Sep 5, 2024, 7:20 AM IST
|Updated : Sep 5, 2024, 10:21 PM IST
ఏపీలో వరద సృష్టించిన బీభత్సం - కర్షకుల కష్టం 'కృష్ణా'ర్పణం - AP FLOODS EFFECT 2024
మాకు పాత ఫ్యాకల్టీనే కావాలి - టీచర్స్ డే రోజు గురుకుల విద్యార్థుల డిమాండ్ - Students Protest at Goulidodi
Students Protest at Goulidodi : తమకు పాత ఫ్యాకల్టీనే తిరిగి నియమించాలంటూ గచ్చిబౌలిలోని గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఇటీవల నియమించిన సిబ్బంది సరిగ్గా బోధించడంలేదని, వచ్చిన వారికి ఐఐటీ, నీట్ సిలబస్ అవగాహన లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. | Read More
మానవ తప్పిదాలే పెనుశాపాలుగా మారాయా? - Causes OF Floods In Telangana
Causes OF Floods In Telangana : విజయవాడ, ఖమ్మంను ముంచెత్తిన వరదలను చూశాక అమ్మ బాబోయ్ ఇంతటి విపత్తా అని ఆశ్చర్యం కలగకమానదు. కొన్ని రోజుల్లో కురవాల్సిన వర్షం ఒకేరోజు అది కూడా రికార్డు స్థాయిలో కురవడం ఎప్పుడూ చూడనంత భారీ వరద నివాస ప్రాంతాలను ముంచెత్తడం చూస్తే కారణం ఏమిటనే సందేహం వస్తుంది. ప్రస్తుత వరదలను చూస్తే ఇళ్లు నదుల్లో ఉన్నాయా లేదా నదులే ఇళ్ల మధ్య ఉన్నాయా అన్నట్లుగా పరిస్థితులు మారడమే ఇందుకు కారణం. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు ఎక్కడో ఓ చోట తరచూ తలెత్తుతున్నాయి. మరి, ఎందుకు ఇలా జరుగుతుంది? కారణం అభివృద్ధా ఆక్రమణలా? నష్టపోయిన ప్రజల పరిస్థితేంటి? ఇప్పుడు చూద్దాం. | Read More
చెరువుల ఆక్రమణ, అస్తవ్యస్తంగా నిర్మాణాలు - ఇదేనా ఖమ్మం, విజయవాడ వరదలకు కారణం! - Reasons for Floods in TG and AP
Floods in Telugu States : ఒక సారి నష్టం జరిగితే రెండో సారి అది పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. మరి పదేపదే నష్టం జరుగుతున్నా సరిదిద్దుకోకుంటే దాన్నే నిర్లక్ష్యం అంటారు. ఆ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష ఉదాహరణలు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, ఖమ్మం విలయాలు. వీటికి ప్రకృతి ప్రకోపం కారణమైనా మనిషి చేసిన తప్పిదాలు, పాఠాలు నేర్వని తత్వమే నష్టం తీవ్రతను మరింత పెంచింది. ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు, దేశంలోని పలు ప్రాంతాల్లో సైతం ఇదే పరిస్థితి. ఈ విపత్తులు మనిషి ఇప్పటికైనా అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని చాటి చెబుతున్నాయి. మరి ఎలా అప్రమత్తం కావాలి. ఏ జాగ్రత్తలు తీసుకుంటే వరదలను తప్పించుకోగలం. ఈ విపత్తుల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి. | Read More
రమాదేవి పబ్లిక్ స్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు - Teachers Day celebrations
Teachers Day celebrations:హైదరాబాద్లోని రమాదేవి పబ్లిక్ స్కూల్లో టీచర్స్డేను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రత్యేకంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బృందం హాజరై, ఉపాధ్యాయులను సన్మానించింది. ముఖ్య అతిథిగా యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ ఎం. మహేశ్వర స్వామి హాజరుకాగా, చీఫ్ మేనేజర్ వంశీచంద్ రెడ్డి భాగస్వామ్యమయ్యారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. గురువుల ప్రాధాన్యాన్ని వివరించేలా వారు చేపట్టిన ప్రత్యేక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. | Read More
నిండా ముంచిన మున్నేరు - సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ ప్రజలు - Floods in Telangana 2024
Floods in Telangana 2024 : వర్షం, విలయ తాండవం. జనజీవనం అతలాకుతలం. ముంపు ప్రాంత ప్రజల జీవితాలు అస్తవ్యస్తం. ఒక్క రోజులోనే ఏళ్ల పాటి కష్టం. భారీ వర్షాలతో ఎగువ నుంచి వచ్చిన వరద. ఎంతటి విపత్కర పరిస్థితులను తీసుకొచ్చిందో ఖమ్మం, విజయవాడలో చోటుచేసుకున్న పరిణామాలే నిదర్శనం. ఉప్పొంగిన వాగులు, నదుల నీటితో కాలనీలు, చెరువులను తలపించాయి. ఇళ్లన్నీ నీట మునిగాయి. ఇలా ఇరు రాష్ట్రాల్లో వర్షం తెచ్చిన కష్టం, నష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి ఇలాంటి విపత్తులకు బలి కావాల్సిందేనా? వీటి నుంచి బయటపడే మార్గాలేమిటి. | Read More
ఎలా ఉన్నావు? అని అడగడం బదులు జ్వరం తగ్గిందా అని అడిగే పరిస్థితి వచ్చింది! - Viral Fevers In Telangana
Viral Fever Cases Increasing in Telugu States : వర్షాకాలం! దీనికి మరో పేరు వ్యాధుల కాలం. వాతావరణ మార్పుల కారణంగా ఈ సీజన్లో వ్యాధులు ప్రబలడమే అందుకు కారణం. కానీ, ఈ ఏడు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో సీజనల్ వ్యాధుల విజృంభణ అధిక స్థాయిలో ఉంది. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలతో అధిక శాతం మంది మంచాన పడుతున్నారు. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, నిమోనియాలూ రోగుల చుట్టుముడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు ప్రతి ఇంట్లో ఒక్కరైనా జలుబు లేదా జ్వరంతో బాధపడుతున్నారు. రోగుల తాకిడితో ఆసుపత్రుల్లోని ఒక్కో బెడ్డును ఇద్దరు లేదా ముగ్గురికి కేటాయిస్తోన్న పరిస్థితులు ఉన్నాయి. మరి విషజ్వరాలు ఈ స్థాయిలో విజృంభించడానికి కారణాలేంటి? వీటి బారిన పడకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? | Read More
బిగ్ అలర్ట్ : రాష్ట్రంలో ఐదురోజులపాటు భారీ వర్షాలు - ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ - Heavy Rain Alert to Telangana
Heavy Rains in Telangana : రాష్ట్రంలో వర్ష హోరు తగ్గడం లేదు. ఇటీవల కురిసిన వానలకు తడిసి ముద్దయిన తెలంగాణకు మరో ఐదు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్నట్టు ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ను జారీ చేసింది. ప్రజలు ఈ ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ పేర్కొంది. | Read More
వరద బాధితులకు సాయం చేయడంలో ప్రభుత్వం విఫలం : హరీశ్రావు - Harish Rao On CM Revanth Reddy
Harish Rao Comments On CM Revanth : వరద బాధితులకు సాయమందించడానికి వెళ్తే తమపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడ్డారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. బాధితులకు కనీసం అన్నం, నీళ్లు కూడా ఇవ్వలేకపోయారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. | Read More
మేడం సార్ మేడం అంతే - ఈ లెక్కల టీచర్ పాఠాలు చెప్పే లెక్కే వేరు - HAPPY TEACHERS DAY 2024
Story on Padma Priya Vummaji Teacher : గణితం ఈ మాట చెబితే చాలు ఎక్కువ మంది విద్యార్థులు దిక్కులు చూస్తుంటారు. జీవితంలో ప్రతి క్షణం అవసరమయ్యే లెక్కలంటే మక్కువ చూపే వారు తక్కువే. కానీ పదో తరగతి వరకు ఇది తప్పని సబ్జెక్టే. జీవితం సాఫిగా సాగాలంటే నేర్చుకొని తీరాల్సిన పాఠమే. అంత ముఖ్యమైన గణితాన్ని సులభంగా బోధించటమే కాదు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తెరలు, ఆన్లైన్ పాఠాలను పరిచయం చేసి విద్యార్థులకు కొత్త తరహా బోధన చేసి మేటి గురువుగా నిలిస్తున్నారు పద్మప్రియ అనే గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు. | Read More
జాబ్ కోసం విద్యార్థులకు స్కూల్ నుంచే ట్రైనింగ్ - ఈ మాస్టారు గురించి మీరూ తెలుసుకోవాల్సిందే - Best Award For Sangareddy Teacher
Sangareddy Teachers Wins Best Teacher Award : ఈ గురువు శిక్షణ ఉపాధికి నిచ్చెనలా నిలుస్తుంది. వృత్తి పరంగా వ్యాయామ ఉపాధ్యాయుడైనా అన్ని అంశాల్లో నిష్నాతుడు. పోలీసు ఉద్యోగాన్ని వదిలి తనకు ఇష్టమైన వ్యాయామ ఉపాధ్యాయునిగా ప్రభుత్వ పాఠశాలలో కొలువు సాధించారు. ఇప్పుడు ఆయన శిక్షణలో అనేక మంది పోలీసు, రక్షణ శాఖల్లో ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు. విద్యార్థుల పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక, సామాజిక విషయాల్లో వారికి తోడునీడగా నిలుస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయునిగా గుర్తింపు తెచ్చుకున్నారు | Read More
అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వైసీపీ లీడర్స్!- ఎక్కడ దాక్కున్నట్టు? - YSRCP LEADERS ABSCONDING IN AP
Mangalagiri TDP Office Attack Case Update : నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడే వైఎస్సార్సీపీ నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా పక్క రాష్ట్రాలకు జారుకుంటున్నారు. అధికారంలో ఉండగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసాలపై దాడి కేసులలోని నిందితులు అజ్ఞాతవాసం చేయడానికి సిద్దమయ్యారు. ముందస్తు బెయిల్ పిటీషన్ కొట్టి వేసిన క్షణాల్లోనే ఆ కేసులో నిందితులంతా రహస్య ప్రదేశాలకు చెక్కేశారు. | Read More
ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశాం: సీఎం - CM Revanth Reddy On AI
AI Global Summit in Hyderabad 2024 : విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ మాదిరిగా ఏ నగరం సిద్ధంగా లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఏర్పాటైన రెండ్రోజుల అంతర్జాతీయ కృత్రిమ మేథ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం హైదరాబాద్లో ఏఐ సిటీ ఏర్పాటుతో కృత్రిమ మేథ భవిష్యత్తుకు బలమైన పునాది వేశామని పేర్కొన్నారు. | Read More
గణేశ్ మండపం ఏర్పాటు చేస్తున్నారా? - ఐతే ఈ రూల్స్ తప్పక పాటించాల్సిందే - GANESH CHATURTHI POLICE RULES 2024
Ganesh Chaturthi Police Rules 2024 : వినాయక చవితి వచ్చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో గణేశ్ చతుర్థి సందడి షురూ అయింది. ఏ వీధిలో చూసినా గణేశ్ మండపం ఏర్పాట్లతో సందడి సందడిగా కనిపిస్తోంది. హైదరాబాద్లో అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు. ఇక్కడ వీధికో గణపయ్య కొలువుదీరుతుంటాడు. ఈ నేపథ్యంలో గణేశ్ మండపాలు ఏర్పాటు చేసే వారికి హైదరాబాద్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. మండపం ఏర్పాటులో కొన్ని నిబంధనలు తప్పక పాటించాల్సిందేనని అంటున్నారు. మరి ఆ రూల్స్ ఏంటో చూద్దామా? | Read More
ముంపు గుప్పిట్లో ఏపీలోని కొల్లేరు లంక గ్రామాలు - ఆక్రమణలో చెరలో ఉప్పుటేరు - Kolleru Lanka Villages Flood Effect
Kolleru Lanka Villages Stuck in Flood Effect IN AP : ఆంధ్రప్రదేశ్లోని విజయవాడను అల్లకల్లోలం చేసిన బుడమేరు ఇప్పుడు కొల్లేరు లంక గ్రామాలపై విరుచుకుపడుతోంది. వరద నీరు భారీగా చేరడంతో లంకలు జలదిగ్బంధమయ్యాయి. కొల్లేరు నీటిని సముద్రానికి తీసుకెళ్లే ఉప్పుటేరు నిర్వహణ లేమి ఆక్రమణలతో చిక్కిపోయింది. ప్రవాహానికి అడుగడుగునా ఏర్పడుతున్న అడ్డంకులతో లంక గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. | Read More
'వాట్సాప్'కు వచ్చిన లింక్ క్లిక్ చేశాడు - అంతే ఖాతాలో నుంచి రూ.13.26 కోట్లు మాయం - WHATSAPP LINK CYBER FRAUD
Cyber Crime In Hyderabad : హైదరాబాద్లో వివిధ కారణాలు చెబుతూ ఇద్దరి వద్ద నుంచి ఒక్క రోజులోనే సైబర్ నేరగాళ్లు దాదాపు రూ.15 కోట్లు కొట్టేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని వృద్దుడిని మోసగించి 13.16కోట్లు కాజేసిన కేసులో ముగ్గురు సైబర్ నేరగాళ్లను సైబర్ సెక్యూరిటి బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. | Read More
ప్రజాసమస్యలపై యువత గొంతెత్తుతోంది - సోషల్ మీడియాను వేదిక చేసుకుంటోంది - YOUTH QUESTIONSING ON SOCIAL ISSUES
Youth Questioning Public Issues : సోషల్ మీడియా అనగానే చాలామందికి టైమ్పాస్ చేయడానికే వాడుతుంటారు. కానీ కొంతమంది యువత మాత్రం ప్రజాసమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. | Read More
గ్రూప్-4 నియామకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు - ట్రాన్స్జెండర్ల స్పెషల్ రిజర్వేషన్ల కౌంటర్కు 10రోజుల సమయం - TELANGANA HC ON GROUP 4 RESERVATION
Telangana High Court on Group 4 : గ్రూప్-4 పోస్టుల భర్తీ తుది తీర్పునకు లోబడే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే ట్రాన్స్జెండర్ల ప్రత్యేక రిజర్వేషన్ల కల్పనపై 10రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. | Read More
భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ - ఆరుగురు మావోయిస్టులు హతం - 6 MAOISTS KILLED IN TELANGANA TODAY
Six Naxals killed in Bhadradri District : భద్రాద్రి జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఈ కాల్పులు భద్రాద్రి జిల్లాలోని కరకగూడెం మండలం రఘునాథపాలెంలో చోటుచేసుకున్నాయి. | Read More
తెలంగాణ ప్రకృతి విపత్తుపై నివేదిక అందలేదు - సీఎస్కు కేంద్ర హోంశాఖ లేఖ - UNION GOVT ON TELANGANA SDRF FUNDS
Telangana SDRF Funds 2024 : ఇటీవల ప్రకృతి విపత్తుకు సంబంధించి రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి ఎలాంటి అధికారిక నివేదిక అందలేదని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులపై కేంద్ర హోంశాఖకు రోజువారీ నివేదిక పంపేలా అధికారులకు సూచనలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఈ మేరకు ఈ నెల 3 న రాసిన రెండు పేజీల లేఖ బుధవారం బయటకొచ్చింది. | Read More
రైతు కడుపు కొట్టిన వానలు - వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు - HUGE CROP DAMAGE IN TELANGANA
Rains Caused Heavy Loss to Farmers in Telangana : కుంభవృష్టి వానలు రాష్ట్ర అన్నదాతలకు తేరుకోలేని నష్టాన్ని మిగిల్చాయి. కష్టపడి పండించిన పంట నీట మునగడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం తమకు పరిహారం చెల్లిస్తే తప్ప తేరుకోలేమని వాపోతున్నారు. | Read More
మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ - హైదరాబాద్ నుంచి మంగళగిరికి తరలింపు - EX MP Nandigam Suresh Arrest
AP EX MP Nandigam Suresh Arrest : ఏపీ వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయణ్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన పోలీసులు మంగళగిరికి తరలిస్తున్నారు. | Read More
ఆ మా'స్టారు' ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారు -నేటి ఉపాధ్యాయలోకానికి ఆయనో దిక్సూచి - Special Story On Nizamabad Teacher
Special Story On Nizamabad Teacher : సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర. కొందరు మాత్రం బడికి వచ్చామా వెళ్లామా అన్నట్టు ఉంటారు. వృత్తి బాధ్యత నిర్వర్తించడాన్నే భారంగా భావిస్తుంటారు. కానీ ఆయనకు మాత్రం వృత్తి కన్నా విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం. ఓ వైపు సామాజిక కార్యకర్తగా మూఢ నమ్మకాలు పారదోలుతూ మరోవైపు ఉపాధ్యాయుడిగా భావిభారత పౌరులను తయారు చేశారు. పదవీ విరమణ పొందినా సమాజానికి తనవంతుగా కృషిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే నిజామాబాద్ జిల్లాకు చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత నర్రా రామారావు మాస్టారు. | Read More
ఈ మాస్టారు పాఠం చెబితే రాళ్లయైన కరగాల్సిందే - కలాం డ్రీమ్ ఫోర్స్ ఫౌండేషన్తో పిల్లలకు చేయూత - physics Teacher Sridhar teaching
Physics Teacher Nobel Prize Story : తల్లిదండ్రుల తర్వాత అత్యంత సమయం పిల్లలతో కేటాయించేది గురువులు మాత్రమే. పాఠశాలలో పనిచేసేది 8 గంటలే కానీ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాత్రం విరామం దొరికితే చాలు విద్యార్ధుల కోసం ఏదో చేయాలని తపిస్తూ ఉంటాడు. వృత్తిపరంగానే కాదు వ్యక్తిగత జీవితంలోనూ సింహభాగం పేదవిద్యార్ధుల కోసమే పరితపిస్తారు. 2040 నాటికి సైన్స్ రంగంలో నోబుల్ బహుమతి అందుకునే స్థాయిలో ఒక్క శాస్త్రవేత్తనైనా తయారు చేయాలన్నది ఆయన అంతిమ లక్ష్యం. | Read More
వాన మిగిల్చిన విషాదం - 117 గ్రామాల్లో 67 వేల మందికి నష్టం - 26 మంది మృతి - telangana floods heavy damage
Telangana Floods Effect : భారీ వరదలతో రాష్ట్రంలో కకావికమైన చోట సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, వైద్య శిబిరాల నిర్వహణ, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై దృష్టి సారించింది. వరదలతో జరిగిన నష్టంపై అంచనాలు సిద్ధం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో పశుసంవర్ధక, మత్య్యశాఖలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాయి. | Read More
హైదరాబాద్ వేదికగా ఏఐ సదస్సు - అందరికీ అందుబాటులోకి 'AI' నినాదంతో గ్లోబల్ సమ్మిట్ - AI Global Summit in Hyderabad
Telangana Global AI Summit 2024 : అంతర్జాతీయ కృత్రిమ మేథ సదస్సుకు హైదరాబాద్ వేదికకానుంది. హెచ్ఐసీసీలో రెండు రోజుల పాటు జరిగే సదస్సును ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. ఆ సదస్సుకు అంతర్జాతీయ స్థాయి ఏఐ కంపెనీలు సహా , సీఈవోలు హాజరుకానున్నారు. హైదరాబాద్ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ఆ సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. | Read More
వామ్మో దెయ్యం, అమావాస్య నాడు స్కూల్లో నిద్రపోయిన టీచర్ - చివరకు ఏం జరిగిందంటే - Ghost Teacher in Adilabad
Ghost Teacher in Adilabad : తెలుగు మాస్టారు, లెక్కల మాస్టారు, సోషల్ మాస్టారు, అని విద్యార్థులు తమ ఉపాధ్యాయులను పిలుచుకుంటారు. మరి! దెయ్యం మాస్టారు అని పిలిస్తే? కొత్తగా ఉంది కదా! కానీ ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు ఓ ఉపాధ్యాయుడు దెయ్యం మాస్టారుగా మారుమోగిపోతున్నారు. ఇంతకీ ఆయనకు ఈ బిరుదు రావడం వెనుక కథేంటో చూద్దాం. | Read More
పచ్చని చెట్లు, జంతువుల వద్దకు తీసుకెళ్లి విద్యార్థులకు పాఠాలు - ఈ సారు పాఠం వింటే లైఫ్లో మర్చిపోరు - HAPPY TEACHERS DAY 2024
Vikarabad Teacher Got Best Teacher Award : విద్యార్థులకు నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టించకుండా ప్రయోగాత్మకంగా పాఠం నేర్పిస్తే జీవితకాలం ఆ విషయాన్ని మర్చిపోరనే సూత్రాన్ని గ్రహించాడు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. పిల్లలకు వినూత్నంగా విద్యను బోధిస్తూ దిల్లీలో జరిగే స్వాతంత్ర దినోత్సవానికి ఆహ్వానాన్ని అందుకున్నాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా భవిష్యత్లో ఉన్నత స్థాయికి ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించి వినూత్న పద్ధతిలో బోధన చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. | Read More
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడి 'మిషన్ 100' - ఆవిష్కరణలే అతని ఊపిరి - tg teacher NATIONAL TEACHER AWARD
TG Teacher Select for National Teacher Award : చిన్ననాటి నుంచే శాస్త్రవిజ్ఞానంపై ఆసక్తి పెంచుకున్నారు. దేశహితం కోసం కొత్త ఆవిష్కరణల కోసం అహర్నిశలు ప్రయత్నించారు. ఆ కోవలోనే ఇస్రో శాస్త్రవేత్తగా స్థిరపడాలనే తన ఆకాంక్ష నెరవేరలేదు. ఐనా నిరుత్సాహపడకుండా తనలా ఎందరో విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు ఉపాధ్యాయుడు తాడూరి సంపత్ కుమార్. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట జడ్పీ పాఠశాలలో భౌతికశాస్త్రం బోధిస్తూ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు పురస్కారంతో మెరిశారు. | Read More