ETV Bharat / state

కొత్త రేషన్​ కార్డుదారులకు గుడ్​ న్యూస్ - అక్టోబరు 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ - New Ration Cards issue oct 2nd

author img

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Updated : 5 hours ago

Ration Cards Issue CM Review : కొత్త రేషన్​ కార్డు కోసం ఎదురు చూసే వారికి సీఎం గుడ్​ న్యూస్​ చెప్పారు. అక్టోబరు 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు. రేష‌న్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ సచివాలయంలో సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు.

Ration Cards Issue CM Review
Ration Cards Issue CM Review (ETV Bharat)

New Ration Cards will be Issued from 2nd October : కొత్తగా రేషన్​ కార్డులు జారీ కోసం అక్టోబరు రెండో తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అధికారులకు సూచించారు. రేష‌న్ కార్డులు జారీకి ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ ప్రణాళిక రూపొందించాల‌ని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. రేష‌న్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ సచివాలయంలో సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యద‌ర్శులు చంద్రశేఖ‌ర్ రెడ్డి, సంగీత స‌త్యనారాయ‌ణ‌, మాణిక్ రాజ్, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యద‌ర్శి రామ‌కృష్ణారావు, వ్యవ‌సాయ శాఖ కార్యద‌ర్శి ఎం.ర‌ఘునంద‌న్‌రావు, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ ప్రిన్సిప‌ల్ కార్యద‌ర్శి డి.ఎస్‌.చౌహాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు. అర్హులంద‌రికీ డిజిట‌ల్ రేష‌న్ కార్డులు ఇచ్చేందుకు క‌స‌ర‌త్తు చేశారు. అయితే ఈ అంశంపై త్వరలోనే మ‌రోసారి స‌మీక్ష నిర్వహించాల‌ని నిర్ణయించారు.

రాష్ట్రంలో కొత్త రేషన్​కార్డుల జారీకి మంత్రివర్గ ఉపసంఘం విధి విధానాలను రూపొందిస్తోంది. ఈ క్రమంలో ఆయా కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితిని కూడా నిర్ణయించనుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో రెండు ఆదాయ పరిమితుల ప్రకారం రేషన్​ కార్డులు జారీ చేసేవారు. ఇప్పుడు ఈ ఆదాయ పరిమితిని మార్చాలా, తగ్గించాలా, ఉన్నదాన్నే కొనసాగించాలా అన్నదానిపై కమిటీ కసరత్తు చేస్తోంది. దీనిపై పౌర సరఫరాల శాఖ కమిషనర్​ డీఎస్​ చౌహాన్ నేతృత్వంలో పలువురు అధికారులు గుజరాత్​, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధి విధానాలను అధ్యయనం చేశారు.

నివేదికలో పలు మార్పులు : పలు రాష్ట్రాల్లో అధ్యయనానికి వెళ్లిన బృందం ఒక నివేదికను ఉపసంఘానికి అందజేసింది. దానిపై చర్చ సాగింది. రాష్ట్రంలో రేషన్​కార్డును ఒక్క పౌర సరఫరాల వస్తువులను తీసుకోవడానికే కాకుండా పలు సంక్షేమ పథకాల్లోనూ ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయ పరిమితి నిర్ధారణ విషయంలో కొత్త రేషన్​ జారీపై పలు మార్పులను చేయాలని చూస్తోంది. పరిమితిని తగ్గిస్తే ఎంత వరకు తగ్గించాలి, ఇప్పుడున్నట్లు కొనసాగిస్తే అర్బన్​ ఏరియాల్లోనే అదే పరిమితిని ఉంచాలా లేదా, లేక తగ్గించాలా, ఆదాయం వ్యత్యాసం ఉంటుంది కావున ఇలా అన్ని కోణాల్లో సంఘం తాజాగా చర్చించినట్లు తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ, అర్బన్​ ఏరియాలుగా వార్షికాదాయ పరిమితిని అమలు చేస్తున్నారు. దీని ఆధారంగానే తెల్ల రేషన్​కార్డును ప్రభుత్వాలు ఇస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, అర్బన్​ రూ.2 లక్షల్లోపు ఆదాయాన్ని కార్డుల జారీకీ ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. భూ విస్తీర్ణం తరి భూమి అయితే 3.5 ఎకరాలు, మాగాణి భూమి అయితే 7.5 ఎకరాలలోపు ఉండాలనే నిబంధనలు అమలు చేస్తున్నారు.

కార్డుల జారీకి వార్షికాదాయం అర్హతగా : రాష్ట్రంలో 89.96 లక్షల మందికి రేషన్​ కార్డులుండగా, వాటి పరిధిలో 2.1 కోట్ల మంది సభ్యులున్నారు. వీటిలో 5.66 లక్షలు అంత్యోదయ, అన్నపూర్ణ పథకాల కింద 5,416 కార్డులు ఉన్నాయి. తెల్ల కార్డుదారులకు 6 కిలోల బియ్యం (కేంద్రం నుంచి 5 కిలోలు, రాష్ట్రం నుంచి 1 కిలో) ఇస్తున్నారు. అన్నపూర్ణ లబ్ధిదారులకు 10 కిలోల బియ్యాన్ని రాష్ట్రం ఇవ్వగా, అంత్యోదయ కార్డుదారులకు కేంద్రం 35 కిలోల బియ్యం అందజేస్తున్నాయి. కార్డుల జారీకి వార్షికాదాయాన్ని అర్హతగా తీసుకుంటున్నారు.

తెలంగాణలో కొత్త రేషన్​ కార్డులు - ఆదాయం ఎంతలోపు ఉండాలి? - New Ration Card in Telangana

గ్రామాల్లో రూ.లక్షన్నర, పట్టణాల్లో రూ.2 లక్షల వార్షికాదాయం - కొత్త రేషన్​ కార్డుల గైడ్​లైన్స్​ ఇవే - new ration cards in telangana

New Ration Cards will be Issued from 2nd October : కొత్తగా రేషన్​ కార్డులు జారీ కోసం అక్టోబరు రెండో తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అధికారులకు సూచించారు. రేష‌న్ కార్డులు జారీకి ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ ప్రణాళిక రూపొందించాల‌ని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. రేష‌న్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ సచివాలయంలో సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యద‌ర్శులు చంద్రశేఖ‌ర్ రెడ్డి, సంగీత స‌త్యనారాయ‌ణ‌, మాణిక్ రాజ్, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యద‌ర్శి రామ‌కృష్ణారావు, వ్యవ‌సాయ శాఖ కార్యద‌ర్శి ఎం.ర‌ఘునంద‌న్‌రావు, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ ప్రిన్సిప‌ల్ కార్యద‌ర్శి డి.ఎస్‌.చౌహాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు. అర్హులంద‌రికీ డిజిట‌ల్ రేష‌న్ కార్డులు ఇచ్చేందుకు క‌స‌ర‌త్తు చేశారు. అయితే ఈ అంశంపై త్వరలోనే మ‌రోసారి స‌మీక్ష నిర్వహించాల‌ని నిర్ణయించారు.

రాష్ట్రంలో కొత్త రేషన్​కార్డుల జారీకి మంత్రివర్గ ఉపసంఘం విధి విధానాలను రూపొందిస్తోంది. ఈ క్రమంలో ఆయా కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితిని కూడా నిర్ణయించనుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో రెండు ఆదాయ పరిమితుల ప్రకారం రేషన్​ కార్డులు జారీ చేసేవారు. ఇప్పుడు ఈ ఆదాయ పరిమితిని మార్చాలా, తగ్గించాలా, ఉన్నదాన్నే కొనసాగించాలా అన్నదానిపై కమిటీ కసరత్తు చేస్తోంది. దీనిపై పౌర సరఫరాల శాఖ కమిషనర్​ డీఎస్​ చౌహాన్ నేతృత్వంలో పలువురు అధికారులు గుజరాత్​, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధి విధానాలను అధ్యయనం చేశారు.

నివేదికలో పలు మార్పులు : పలు రాష్ట్రాల్లో అధ్యయనానికి వెళ్లిన బృందం ఒక నివేదికను ఉపసంఘానికి అందజేసింది. దానిపై చర్చ సాగింది. రాష్ట్రంలో రేషన్​కార్డును ఒక్క పౌర సరఫరాల వస్తువులను తీసుకోవడానికే కాకుండా పలు సంక్షేమ పథకాల్లోనూ ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదాయ పరిమితి నిర్ధారణ విషయంలో కొత్త రేషన్​ జారీపై పలు మార్పులను చేయాలని చూస్తోంది. పరిమితిని తగ్గిస్తే ఎంత వరకు తగ్గించాలి, ఇప్పుడున్నట్లు కొనసాగిస్తే అర్బన్​ ఏరియాల్లోనే అదే పరిమితిని ఉంచాలా లేదా, లేక తగ్గించాలా, ఆదాయం వ్యత్యాసం ఉంటుంది కావున ఇలా అన్ని కోణాల్లో సంఘం తాజాగా చర్చించినట్లు తెలిపింది.

తెలుగు రాష్ట్రాల్లో గ్రామీణ, అర్బన్​ ఏరియాలుగా వార్షికాదాయ పరిమితిని అమలు చేస్తున్నారు. దీని ఆధారంగానే తెల్ల రేషన్​కార్డును ప్రభుత్వాలు ఇస్తున్నాయి. గ్రామీణ ప్రాంతంలో రూ.1.50 లక్షలు, అర్బన్​ రూ.2 లక్షల్లోపు ఆదాయాన్ని కార్డుల జారీకీ ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. భూ విస్తీర్ణం తరి భూమి అయితే 3.5 ఎకరాలు, మాగాణి భూమి అయితే 7.5 ఎకరాలలోపు ఉండాలనే నిబంధనలు అమలు చేస్తున్నారు.

కార్డుల జారీకి వార్షికాదాయం అర్హతగా : రాష్ట్రంలో 89.96 లక్షల మందికి రేషన్​ కార్డులుండగా, వాటి పరిధిలో 2.1 కోట్ల మంది సభ్యులున్నారు. వీటిలో 5.66 లక్షలు అంత్యోదయ, అన్నపూర్ణ పథకాల కింద 5,416 కార్డులు ఉన్నాయి. తెల్ల కార్డుదారులకు 6 కిలోల బియ్యం (కేంద్రం నుంచి 5 కిలోలు, రాష్ట్రం నుంచి 1 కిలో) ఇస్తున్నారు. అన్నపూర్ణ లబ్ధిదారులకు 10 కిలోల బియ్యాన్ని రాష్ట్రం ఇవ్వగా, అంత్యోదయ కార్డుదారులకు కేంద్రం 35 కిలోల బియ్యం అందజేస్తున్నాయి. కార్డుల జారీకి వార్షికాదాయాన్ని అర్హతగా తీసుకుంటున్నారు.

తెలంగాణలో కొత్త రేషన్​ కార్డులు - ఆదాయం ఎంతలోపు ఉండాలి? - New Ration Card in Telangana

గ్రామాల్లో రూ.లక్షన్నర, పట్టణాల్లో రూ.2 లక్షల వార్షికాదాయం - కొత్త రేషన్​ కార్డుల గైడ్​లైన్స్​ ఇవే - new ration cards in telangana

Last Updated : 5 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.