TTD On Tirumala Laddu Controversy : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూపై ఇక నుంచి భక్తులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని టీటీడీ స్పష్టం చేసింది. ఆలయంలో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత కార్యక్రమాలు చేపట్టింది. కల్తీ నెయ్యితో వెంకన్న లడ్డూను తయారు చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బ తీయడంపై సంప్రోక్షణ చర్యలు చేపట్టి, దోష నివారణ ఆలయ యాగశాలలో శాంతి హోమం నిర్వహించారు. | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 23 September 2024
Telangana News Today Live : తెలంగాణ Mon Sep 23 2024 లేటెస్ట్ వార్తలు- లడ్డూ విషయంలో డౌట్ వద్దు - అంతకంటే ముందే నెయ్యి మార్చేశాం : టీటీడీ - TTD ON TIRUMALA LADDU CONTRPVERSY
Published : 5 hours ago
|Updated : 20 minutes ago
లడ్డూ విషయంలో డౌట్ వద్దు - అంతకంటే ముందే నెయ్యి మార్చేశాం : టీటీడీ - TTD ON TIRUMALA LADDU CONTRPVERSY
15 రోజుల్లో 4500పైగా ఫోన్లు ట్యాపింగ్ - వెలుగులోకి కీలక విషయాలు - TELANGANA PHONE TAPPING CASE UPDATE
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం 15 రోజుల్లో 4 వేల 5 వందలకుపైగా ఫోన్లను ట్యాప్ చేసినట్లు తెలిసింది. తిరుపతన్న బెయిల్ పిటిషన్పై వాదనల వేళ ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తెచ్చారు. సీఎం రేవంత్రెడ్డి సహా ఇతర నేతల ట్యాపింగ్కు సంబంధించి 340 జీబీ సమాచారాన్ని పోలీసులు వెలికితీస్తున్నారు. | Read More
ముంబయి నటి కేసు - వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్కు రిమాండ్ - Mumbai Actress Case Updates
Mumbai Actress Case Updates : ముంబయి నటి కాదంబరీ జెత్వానీ కేసు నిందితుడు కుక్కల విద్యాసాగర్కు కోర్టు వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధించారు. విద్యాసాగర్ను దేహ్రాదూన్ నుంచి రైలులో అర్ధరాత్రి విజయవాడ తీసుకొచ్చిన పోలీసులు, వైద్య పరీక్షల అనంతరం జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ మేరకు నిందితుడికి వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధించారు. | Read More
లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి - ప్రాయశ్చిత్తంగా తిరుమలలో శాంతి హోమం - Maha Shanti Homam in Tirumala
Tirumala Shanthi Homam Today : తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం ప్రారంభమైంది. ఆలయంలోని యాగశాలలో అర్చకులు హోమం నిర్వహిస్తున్నారు. శాంతి హోమంలో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. | Read More
కావూరి హిల్స్పైకి 'హైడ్రా' బుల్డోజర్లు - నేలమట్టమైన అక్రమ నిర్మాణాలు - HYDRA DEMOLITIONS IN MADHAPUR
Hydra Demolitions in Madhapur : హైదరాబాద్ మాదాపూర్లోని కావూరి హిల్స్లో హైడ్రా బుల్డోజర్లకు పని చెప్పింది. కావూరి హిల్స్ పార్కులోని అక్రమ షెడ్లను కూల్చేసింది. గడువు తీరకముందే స్పోర్ట్స్ అకాడమీని అన్యాయంగా కూల్చేశారని నిర్వాహకులు ఆరోపించారు. | Read More
ఆల్కాహాల్తో మెదడుకు ముప్పు - అమెరికా అధ్యయనం ఏం తేల్చిందంటే? - ALCOHOL CAUSES BRAIN HEMORRHAGE
Alcohol Impact On Human Brain : మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలుసు. మద్యపానం వల్ల లివర్ ఎక్కువ డ్యామేజ్ అవుతుందని తెలుసు. కానీ ఎక్కువగా మద్యం సేవించడానికి, మెదడులో రక్తస్రావానికి లింకు ఉందని మీకు తెలుసా ? ఆల్కహాల్ వల్ల బ్రెయిన్ కూడా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుందని అమెరికాలో తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. కిందపడడం వల్ల తలకు దెబ్బతగిలి తీవ్ర గాయాలపాలవుతున్న వారిలో మెదడులో రక్తస్రావానికి మద్యపానం అలవాటే అధిక కారణమవుతోందని గుర్తించింది. రోజూ తాగేవారిలో 150 శాతం ముప్పు అధికం అని వెల్లడించింది. | Read More
సింగరేణి, జెన్కో ఆధ్వర్యంలో రామగుండం విద్యుత్ ప్లాంటు - రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం - RAMAGUNDAM NEW THERMAL PLANT
TG Govt on New Thermal Power Plant : సింగరేణి, జెన్కో ఆధ్వర్యంలో సంయుక్త భాగస్వామ్యంగా కొత్తగా థర్మల్ విద్యుత్ ప్లాంటును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సింగరేణితో కలిసి విధివిధానాలను వారంలోగా రూపొందించుకోవాలని జెన్కోకు రాష్ట్ర ఇంధనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. | Read More