Quiz on Ramayana Kavyam : ఉగాండా రాజధాని కంపాలా నగరంలో ఉన్న హిందూ పిల్లలు సంస్కృతి, వారసత్వం, పురాణాలు, ఇతిహాసాలు మరచిపోకుండా రామాయణ కావ్యంపై క్విజ్ ప్రోగ్రాం ప్రారంభించారు. సుమారు 216 మంది పిల్లలు 54 టీమ్లుగా పాల్గొన్నారు. క్వాలిఫైయింగ్ రౌండులో పోటీ పడి ద్వితీయ రౌండ్కు 22 టీమ్లు చేరుకున్నాయి. | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 6 September 2024
Telangana News Today Live : తెలంగాణ Fri Sep 06 2024 లేటెస్ట్ వార్తలు- సంస్కృతి, పురాణాలు, ఇతిహాసాలు మరచిపోకుండా 'ఉగాండా'లో రామాయణ కావ్యంపై క్విజ్ పోటీలు - Quiz on Ramayana in Uganda
Published : Sep 6, 2024, 7:20 AM IST
|Updated : Sep 6, 2024, 10:27 PM IST
సంస్కృతి, పురాణాలు, ఇతిహాసాలు మరచిపోకుండా 'ఉగాండా'లో రామాయణ కావ్యంపై క్విజ్ పోటీలు - Quiz on Ramayana in Uganda
హైదరాబాద్లో దారుణం - చిన్నపిల్లలే లక్ష్యంగా విస్కీతో ఐస్క్రీమ్ తయారు చేసి విక్రయం - Whiskey Ice cream
Whiskey IceCream Rocket Arrest : హైదరాబాద్లో విస్కీతో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఐస్క్రీమ్ పార్లర్లో సోదాలు చేసిన అధికారులు, ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. | Read More
హైదరాబాద్లో మరోసారి భారీవర్షం - పలుచోట్ల ట్రాఫిక్ జామ్ - Heavy rains in Telangana
Heavy Rain in Hyderabad : ఉదయం నుంచి కాస్త ఎండగా ఉండటంతో ఊపిరితీసుకున్న భాగ్యనగరవాసికి వరుణుడు మరోసారి షాకిచ్చాడు. సాయంత్రం వేళ నగరంలో భారీవర్షం మొదలైంది. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న ఉద్యోగులు, స్కూళ్ల నుంచి బయలుదేరిన విద్యార్థులు అంతా వర్షంతో ఇబ్బందులు పడ్డారు. | Read More
కేంద్రమంత్రి శివరాజ్సింగ్తో సీఎం రేవంత్ భేటీ - వరద ప్రాంతాల్లో జరిగిన నష్టంపై వివరణ - CM Revanth Meet With Shivraj Singh
CM Revanth Met Union Minister Shivraj Singh : రాష్ట్రంలో నెలకొన్న వరద విపత్కర పరిస్థితులపై ఖమ్మంలో పర్యటించిన కేంద్రమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, అనంతరం సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సాధారణంగా స్వాగతించి, కేంద్రమంత్రికి వరద విలయంపై వివరించారు. ఆయన వెంట మరో కేంద్రమంత్రి బండి సంజయ్, పలువురు రాష్ట్ర మంత్రులు ఉన్నారు. | Read More
తెలుగు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం రూ.3,300 కోట్ల ఆర్థిక సాయం - central govt announce flood relief
central govt announce flood relief : తెలుగు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రెండు రాష్ట్రాలకు కలిపి రూ.3,300 కోట్లు సాయం చేస్తున్నట్లు వెల్లడించింది. | Read More
తెలంగాణ పీసీసీ ఛీప్గా మహేశ్కుమార్ గౌడ్ - AICC ANNOUNCE TELANGANA PCC CHIEF
AICC ANNOUNCE TELANGANA PCC CHIEF : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా మహేష్కుమార్ గౌడ్ను ఏఐసీసీ ప్రకటించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. | Read More
ఏపీలో వరద సహాయక చర్యలు ముమ్మరం - బుడమేరు గండ్లు పూడ్చివేతకు రంగంలోకి దిగిన ఆర్మీ - Flood Relief Efforts Speedup in AP
Army Stands by the Flood Victims in AP : ఏపీలోని బెజవాడను ముంచిన బుడమేరు కాలువ గండ్లు పూడ్చేందుకు ఆర్మీ దళాలు రంగంలోకి దిగాయి. అత్యంత క్లిష్టంగా ఉన్న మూడో గండి పూడ్చివేత పనులను ఆర్మీ అధికారుల సహకారంతో సర్కార్ వేగంగా పూర్తి చేయటానికి సన్నాహాలు చేస్తోంది. మరోవైపు ఏపీ వరద సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత పనుల పురోగతిని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. | Read More
పాలమూరు- రంగారెడ్డి పనులు తొమ్మిది నెలలుగా నిలిచిపోయాయి : నిరంజన్ రెడ్డి - NIRANJAN REDDY ON PALAMURU PROJECT
Niranjanreddy Comment on irrigation:పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పనులు తొమ్మిది నెలలుగా నిలిచిపోయాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా ఇంకా పనులు చేపట్టరా అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. | Read More
చిన్న చిన్న సమస్యలను సైతం భూతద్దంలో చూపుతున్నారు : సీతక్క - SEETHAKKA REVIEW ON GURUKULAS
Minister Seethakka Review on Gurukulas : రాష్ట్రంలో గురుకుల విద్యాలయాలు, వసతి గృహాల్లో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను సైతం భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ఉద్యోగుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా కొందరు వ్యవహరిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. | Read More
రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం - ఆ రెండు తేదీల్లో మాత్రం జర జాగ్రత్త! - Heavy Rain Alert to Telangana
IMD Alert To Telangana Rains : బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం మాత్రం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. మరోవైపు ఈ అల్పపీడనం బంగ్లాదేశ్ తీరం వద్ద ఈనెల 9న వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. | Read More
సెలబ్రిటీల ఆరాధ్యదైవం - లక్షలాది భక్తుల దర్శనం కోట్లలో ఆదాయం- ఎక్కడంటే? - Mumbai Siddhivinayak Temple
Sri Siddhivinayak Temple : వినాయకచవితి వచ్చిందంటే చాలు చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ లంబోధరుడి పూజపునస్కారాల్లో మునిగిపోతారు. ఈ ఆలయంలో సామాన్యులతో పాటు పలువురు బాలీవుడ్ తారలు తరచుగా దర్శించుకుంటారు. చిన్న మందిరంగా వున్న ఈ ఆలయం కాలక్రమేణా దేశంలోనే అత్యధిక ఆదాయం కల ఆలయాల్లో ఒకటిగా మారింది. | Read More
భద్రాచలంలో గోదావరిలోకి దూకి కానిస్టేబుల్ ఆత్మహత్య - కొనసాగుతున్న గాలింపు చర్యలు - Constable Suicide in Bhadrachalam
constable Suicide : భద్రాచలంలోని గోదావరి వంతెన పైనుంచి ఓ కానిస్టేబుల్ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్య కారణాలతో పాల్వంచకు చెందిన కానిస్టేబుల్ రమణారెడ్డి నదిలో దూకారు. ఆత్మహత్యకు కారణాలు సెల్ఫీ వీడియో ద్వారా చిత్రీకరించారు. | Read More
నేనూ రైతునే - భావోద్వేగానికి గురైన అన్నదాతను హత్తుకొని ఓదార్చిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ - Union Minister Shivraj on Floods
Union Minister Shivraj Singh Chauhan Inspect Flood Situation : ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రులు పర్యటించారు. ఖమ్మం, పాలేరు, మధిర ప్రాంతాల్లో కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏరియల్ సర్వే నిర్వహించారు. పాలేరులో వరద పరిస్థితిపై ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శనను తిలకించారు. అనంతరం నిర్వహించిన ముఖాముఖిలో రైతులు భావోద్వేగానికి గురయ్యారు. | Read More
అత్యంత విలాస గృహ విక్రయాల్లో హైదరాబాద్కు రెండో స్థానం - ఒక్కో ఇంటి ధర ఎంతంటే? - Most Luxurious Houses Prices
Most Luxurious Houses Prices Increased : దేశంలో ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు పెరుగుతున్నాయని, ఈ సంవత్సరం రూ.40కోట్ల కంటే విలువైన గృహాల విక్రయాలు జరిగాయని స్థిరాస్తి కన్సల్టెంట్ అనరాక్ పేర్కొంది. గృహాల విక్రయాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. | Read More
ఇద్దరు బిడ్డలను చెరువులోకి తోసేసి - ఆపై తానూ ఆత్మహత్య - ఇబ్రహీంపట్నంలో విషాదం - Mother Suicide With Children
Mother Commits Suicide With Children : ఆ తల్లికి ఏ కష్టమొచ్చిందో ఏమో పిల్లలను స్కూల్ నుంచి తీసుకొస్తూ చెరువు దగ్గరకు వెళ్లి వారిని ఆ చెరువులో తోసి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. | Read More
ఆరోగ్యం బాగాలేక కాంస్యం గెలిచా - నెక్ట్స్ గోల్డ్ మెడల్ పక్కా : దీప్తి జీవాంజి - Deepthi Jeevanji Reached India
Bronze Medal Winner Deepthi Reached Hyderabad : కడు పేదరికం నుంచి కాంస్య పథకం గెలుచుకునే స్థాయికి ఎదిగి తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది దీప్తి జీవాంజి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి ప్రపంచ వేదికపై పారాలింపిక్స్లో మహిళల 400 మీటర్ల టీ 20 విభాగంలో కాంస్య పథకం సాధించింది. హైదరాబాద్ తిరిగి వచ్చిన దీప్తికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. | Read More
బీఆర్ఎస్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత - ప్రముఖుల సంతాపం - Jitta Balakrishna Reddy Passes Away
Jitta Balakrishna Reddy Passes Away : తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన గత కొద్ది రోజులుగా యశోదా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. వెంటిలేటర్పై ఉన్న జిట్టా, ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. | Read More
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు - మరి డిమాండ్ ఉందా అంటే? - House Price Hike in Hyderabad
House Price Hike in Hyderabad : హైదరాబాద్ నగరంలో ఇళ్ల ధరలు గత నాలుగేళ్లలో 80 శాతం పెరిగినట్లుగా 'మ్యాజిక్బ్రిక్స్' అనే స్థిరాస్తి కన్సల్టెన్సీ సేవల సంస్థ అధ్యయనం వెల్లడించింది. ఇళ్ల ధరలు పెరిగినప్పటికీ, అదే స్థాయిలో ప్రజల ఆదాయాలు మాత్రం పెరగకపోవడంతో ఇంటి కొనుగోలు కోసం చేసిన రుణాలకు నెలవారీ ఈఎంఐల భారం అధికమవుతోందని వివరించింది. ఈ మేరకు మ్యాజిక్బ్రిక్స్ తన నివేదికలో పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. | Read More
అధిక లాభాలు అనగానే ఆకర్షితులవుతున్నారు - దాచుకున్నంత సొమ్మంతా మోసగాళ్లకు అప్పజెప్పేస్తున్నారు - Real Estate Scams in Telangana
Real Estate Scams in Telangana : హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారం పేరిట మోసాలు పెరిగిపోతున్నాయి. తక్కువ ధరకు మంచి స్థలం అంటూ ప్రజలను నమ్మిస్తూ రూ.కోట్లు దోచేస్తున్నారు. మరోవైపు పెట్టుబడుల పేరిట ఎంత అవగాహన కల్పించినా అధిక లాభాలనగానే నమ్మి రూ.కోట్లు పెట్టి మోసపోతున్నారు. | Read More
ఏడో తరగతిలోనే సొంతంగా ఏఐ కంపెనీలు పెట్టి - అందరి చేత ఔరా అనిపిస్తున్న కవలలు - AI for good Global Summit
AI Global Summit in Hyderabad : వారిద్దరూ కవలలు. వయసు 14 ఏళ్లు. అయితేనేం వారి ఆలోచనలు మాత్రం చాలా జోరు. అందుకే ఏడో తరగతిలోనే సొంతంగా చేరో కంపెనీ పెట్టి ఔరా అనిపిస్తున్నారు. వీరు పెరిగింది అమెరికా అయినా, పుట్టింది మాత్రం హైదరాబాద్లోనే. ప్రస్తుతం హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఏఐ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. | Read More
గల్లీ కా గణేశ్ ఆగయా - అంబరాన్నంటేలా 'గణపయ్య ఆగమన్' వేడుకలు - Ganesh Agaman Celebrations
Ganesh Agaman Celebrations : హైదరాబాద్లో వినాయక చవితి సందడి మొదలైంది. అకాశాన్నంటేలా గణనాథుడికి స్వాగతోత్సవాలు ప్రారంభమయ్యాయి. గణేశ్ ఆగమన్ వేడుకలను పిల్లలు, పెద్దలు కలిసి ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. డప్పుల చప్పుళ్లు, మేళతాళాలు, నృత్యాలు, కేరింతలు, బాణా సంచా సందడి మధ్య యువత గణేశుడికి స్వాగతం పలుకుతున్నారు. | Read More
జగన్ సర్కార్ నిర్లక్ష్యమే 'బుడమేరు'కు శాపం - విస్తరణ పనుల పేరుతో రూ.కోట్లు బుక్కిన నేతలు - YSRCP Govt neglected in Budameru
Budameru Vagu Expansion neglected by YSRCP Govt : బుడమేరు విస్తరణ పేరుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోట్ల రూపాయలు దోచేసింది. పనులను ప్రీక్లోజర్ పేరుతో అర్ధాంతరంగా రద్దు చేసింది. దీనిలో కొందరు ఆ పార్టీ నేతలు, అధికారులు గుత్తేదారులతో కుమ్మక్కై కోట్ల రూపాయలు స్వాహా చేశారు. అసంపూర్తి పనులు, బుడమేరు పాయల మధ్యలో వైఎస్సార్సీపీ నేతల ఆక్రమణలే పొలాల మునకకు కారణమైందనే విమర్శలూ వస్తున్నాయి. | Read More
ప్రమాదమని తెలిసినా - తప్పని ప్రయాణం - రైలు పట్టాలనే రహదారిగా చేసుకున్న గ్రామస్థులు - People Travelling on Railway Bridge
People Traveling on Railway Bridge : రైలు పట్టాలపై రైళ్ల రాకపోకలు చూస్తుంటాం. కొన్ని ప్రాంతాల్లో రైలు పట్టాలు రోడ్లపై ఉంటాయి. వాటిపై నుంచి అందరూ వెళ్లడం మామూలే అనిపిస్తుంది. కానీ మంచిర్యాల జిల్లా ఊరుమందమర్రిలో మాత్రం రైలు మార్గం మీదుగా ప్రజలు రాకపోకలు చూస్తుంటే భయం వేస్తుంది. అది కూడా వాగుపై ఉన్న రైల్వే ట్రాక్పై వారి రాకపోకలు చేస్తున్నారంటే కళ్లు పెద్దవి చేసి చూడాల్సిందే. అంత ప్రమాదకరంగా ఉంది అక్కడ పరిస్థితి. పెద్దవాగుపై వంతెన నిర్మించకపోవడంతో మరో దిక్కులేక ప్రమాదకరంగా ప్రయాణం సాగిస్తున్న దుస్థితి నెలకొంది. రెండు మండలాల ప్రజలు పడుతున్న ఇక్కట్లపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం | Read More
వరద తెచ్చిన కష్టాలు - రిపేర్కు క్యూ కడుతున్న వాహనాలు - జేబులు తడుముకుంటున్న యజమానులు! - Cars damaged due to heavy flood
Cars Damged in Vijayawada : వరద బీభత్సం నుంచి కాస్త తేరుకున్న విజయవాడ ఇప్పుడు కార్ల సమస్యతో సతమతం అవుతుంది. ఎక్కడ చూసిన తిప్పలుకుప్పలుగా కార్లు షోరూం, మెకానిక్ షెడ్లలో ఉన్నాయి. ఈ కార్లను మరమ్మతు చేయడానికి లక్షల్లో ఖర్చు అవుతుందని బాధితులు ఆందోళన చెందుతున్నారు. | Read More
ఖమ్మంలో ఆటోమొబైల్ రంగం కుదేలు : ఎటుచూసినా ఇంజిన్ల భాగాలు విడదీసి శుభ్రం చేస్తున్న దృశ్యాలే! - Flood Effect In Khammam
Flood Effect On Automobile Sector : ఖమ్మం జిల్లాలో వరద సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ఇంట్లో సామగ్రి, వాహనాలు లాంటివి వరద నీటిలో కొట్టుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల ఇంజిన్లలోకి బురద చొచ్చుకుపోవడంతో దానిని తొలగించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వాహనాల షెడ్ బురదమయం కావడంతో రూ.లక్షల విలువైన పరికరాలు పనికి రాకుండా పోయాయని మెకానిక్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. | Read More
కొత్త కోర్సుల ప్రారంభం, సీట్ల కుదింపు, పెంపు వ్యవహారం - ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురు - Engineering Colleges in telangana
Telangana Engineering Colleges Rejected in the High Court : రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో పిటిషన్లను కొట్టివేసింది. ఇప్పటికే అడ్మిషన్ల షెడ్యూల్ పూర్తి అయినందున మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టంగా చెప్పింది. | Read More
'మీ ఇంట్లో ఆత్మ తిరుగుతోంది - పూజలు చేయకపోతే ఫ్యామిలీ మొత్తం చనిపోతారు' - miscreants stole 30 lakhs in Pooja
Criminals RS 30 Lakhs Fraud : ఈ టెక్నాలజీ యుగంలోనూ మంత్రాలకు డబ్బు కట్టలు, ఆరోగ్యం వస్తాయని భావించే వారు చాలా మందే ఉన్నారు. ఇలా నమ్మిన ఓ ఫ్యామిలీ ఏకంగా రూ.30 లక్షలు పోగొట్టుకుంది. ఈ ఘటన హైదరాబాద్లో వెలుగుచూసింది. | Read More
భద్రాద్రి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ - ఆరుగురు మావోయిస్టులు మృతి - Six Maoist Encounter in Telangana
Maoist Encounter in Telangana : తెలంగాణలో మకాం వేయాలి అనుకుంటున్న మావోయిస్టులకు చుక్కలు చూపిస్తున్నారు రాష్ట్ర పోలీసులు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురిని మట్టుబెట్టారు. | Read More
ఏఐతో మానవ జీవితమే మారిపోనుందా? - ఈ ఆవిష్కరణలు చూస్తే షాక్ అవుతారు! - Story On Global AI Summit AT HICC
Story On Global AI Summit AT HICC : పర్యావరణ కాలుష్యం అరికట్టడం, డ్రైవర్ ప్రమేయం లేకుండా కారు ముందుకెళ్లడానికి, విద్యుత్ బిల్లు తగ్గించుకునేందుకు, ఉద్యోగుల హాజరు శాతం, పని తీరు అంచనాకు కృత్రిమ మేధ ( ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఒక్కటే మార్గం. అన్ని రోగాలకు ఒకే మందు మాదిరిగా ప్రతి రంగంలోనూ ఉత్తమ ఫలితాలకు కృత్రిమ మేధ వినియోగం తప్పనిసరైంది. ఏఐలో ఎన్నో ఆవిష్కరణల ప్రదర్శనకు హైదరాబాద్ వేదికగా మారింది. హైటెక్స్లోని హెచ్ఐసీసీలో జరుగుతున్న అంతర్జాతీయ కృత్రిమమేథ సదస్సులో అంకుర పరిశ్రమలు ఆవిష్కరణలు కొలువుదీరాయి. | Read More
నీట మునిగిన పంటలు, నేలకొరిగిన తోటలు - చేతికందే పరిస్థితి లేదంటున్న అన్నదాతలు - Crop Loss In Telangana
Crop Loss In Telangana : వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు పలుచోట్ల అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వాగులు, వంకలు, ప్రాజెక్టులు ఉద్ధృతంగా ప్రవహించడంతో పెద్ద మొత్తంలో పంటలు నీటమునిగాయి. వరద ఉద్ధృతి తగ్గినా పంట చేతికందే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. పంట నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. | Read More
రైతు బీమా ఇకపై మరింత సులభంగా - త్వరలోనే ప్రత్యేక మొబైల్ యాప్ - tg Rythu Bima new mobile app
Rythu Bima Scheme in Telangana : రాష్ట్ర రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రైతుబీమా పథకం కోసం ఇక నుంచి మొబైల్ యాప్ను ఉపయోగించనున్నారు. ఇందుకోసం యాప్ను తయారు చేయాలని నిర్ణయించింది. సాంకేతిక సమస్యలు నివారించి, పథకాన్ని సజావుగా అమలు చేయాలని చూస్తోంది. | Read More