గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ నియామకం - Governor Quota MLCs in telangana
Tamilisai appointed Governor Quota MLCs : తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను నియమించారు. ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్లు ఎమ్మెల్సీలుగా నియామకమయ్యారు.

Published : Jan 25, 2024, 3:22 PM IST
|Updated : Jan 25, 2024, 5:22 PM IST
Tamilisai appointed Governor Quota MLCs : రాష్ట్రంలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తమిళిసై సౌందరరాజన్ నియమించారు. ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ల ఎంపికకు గవర్నర్ ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రతిపాదనలు పంపింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ జావెద్ అలీఖాన్ కుమారుడు మీర్ అమీర్ అలీఖాన్లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను గవర్నర్ ఆమోదించారు.